Connect with us

నిజామాబాద్

నందిపేటలో విరాట్ హిందూ సమ్మేళన ప్రభంజనం

janamvelugunews

Published

on

నందిపేటలో విరాట్ హిందూ సమ్మేళన ప్రభంజనం

హైందవ ధర్మ రక్షణ కవచంగా రాష్ట్రీయ స్వయంసేవక్ 

నందిపేట ఏప్రిల్ 19 జనం వెలుగు:- నందిపేట మండల కేంద్ర నంది గుడి ఆవరణలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిపేట మండల కేంద్ర పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదరానంద మహారాజ్,

మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి కృష్ణ మహారాజ్ పాల్గొనగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల ఆరోగ్య భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి అమినేని కుమారస్వామి, కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు, రాష్ట్ర సేవిక సమితి జిల్లా కార్యవాహిక శుభా దేశ్పాండే వక్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామీజీలు, వక్తలు మాట్లాడుతూ

సనాతన హిందూ ధర్మానికి ఆది అంతం లేదని ఎన్నో లక్షల సంవత్సరాల నుండి జీవన విధానం నేర్పిన మతం ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ మతమేనని, ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలంటే హిందూ మతం మతం కాదని అది ఒక జీవన విధానం అని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా హిందూమత విధానాన్ని ఇష్టపడుతున్నాయని, హిందూ సంస్కృతి, హిందువుల జీవన విధానం సర్వేజనా సుఖినోభవంతును తెలుపుతుందని కొనియాడారు. ప్రతి మనిషిని గౌరవించడం, ప్రతి జీవిని పూజించడం,

హిందువుల సంప్రదాయమని, ఎన్నో సంప్రదాయాలు, మరెన్నో ఆధ్యాత్మికసూక్తులు మన జీవన విధానానికి ఉత్పేరకాలుగా పనిచేస్తాయని అన్నారు. కానీ నేటి సమాజంలో మన హిందువులు మన ధర్మాన్ని,

మన సంప్రదాయాన్ని పాటించకుండా అన్యమతస్తుల కుట్రలకు బలవుతున్నారని, మన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేదంటే భారతదేశంలో హైందవ ధర్మం నామరూపం లేకుండా చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తూ శత్రువులు సిద్ధంగా ఉన్నారని, కావున ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని కాపాడుతూ మన హైందవ ధర్మానికి మన వంతు కృషి చేస్తూ మన పిల్లలను, మన మహిళలను, మన కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు.

ఈ మహత్తర హిందూధర్మిక కార్యక్రమంలో మండల కేంద్ర గీతా కాన్వెంట్, ఉజ్వల, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు భరతనాట్యం, శివతాండవం, వెంకటేశ్వర స్తోత్ర పాటలతో నృత్య ప్రదర్శన చేసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు, అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ సేవికా సమితి బాలికల నియుద్ద, వెల్మల్ గ్రామ విద్యార్థుల భవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చత్రపతి శివాజీ మహారాజ్ వేషధారణతో ఖడ్గం పట్టుకొని శివాజీ మహారాజ్ శ్లోకాలు చెబుతూ ఉత్తేజ పరిచారు.

సర్పంచ్ సిలిండర్ లింగం, తాత్కాలిక హిందూ సమ్మేళన సేవా సమితి అధ్యక్షులు కండక్టర్ నారాయణ, నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ మూడు పంతల పెద్దమనుషులు, నంది గుడి కమిటీ, మండల కేంద్ర ఆలయాల కమిటీల సభ్యులు, వివిధ పార్టీల మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాలు, కుల సంఘాలు, యువకులు, కండ కార్యవాహ గుజ్జేటి గణేష్, కండ సహకార్యవాహ బొడ్డు రాజేంద్ర ప్రసాద్, కండ వ్యవస్థా ప్రముఖ చిక్కెల శశికుమార్, కండ కుటుంబ ప్రబోధన్ తాడ్వాయి ఎల్లా గౌడ్, నందిపేట్ ఉప మండల భౌతిక ప్రముఖ్ గౌలికర్ యాదిలాల్, ఆర్ఎస్ఎస్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ఆర్టీసి ఆర్. ఎం. డిప్యూటీ ఆర్ ఎం.

janamvelugunews

Published

on

రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ఆర్టీసి ఆర్. ఎం. డిప్యూటీ ఆర్ ఎం.

టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి. డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి గురువారం నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి టీజీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా సేవలను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను మరింత విస్తరించాలని సూచించారు.

Continue Reading

నిజామాబాద్

అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం

janamvelugunews

Published

on

అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం

పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నిజామాబాద్ జూన్ 18: నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి. భుజంగ రావు, అదనపు డీసీపీ శుభం ప్రకాష్ నగ్రాలే, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అటవీ శాఖ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చెట్లు నరకడం ఎంతో సులభం అని, కానీ పర్యావరణానికి, ప్రాణికోటికి ఎంతో మేలు చేకూర్చే మొక్కలు నాటి, వాటిని కాపాడడం గురించి ఎంతో మంది తమకు ఎందుకులే అని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, పచ్చదనం పెంపొందించబడుతుందని అన్నారు. జిల్లాలో అటవీ శాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 63వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని, నిజామాబాద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే 476 ఎకరాల విస్తీర్ణంలో అరణ్య అర్బన్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. దైనందిన కార్యకలాపాలతో అలసిన వారికి అర్బన్ పార్క్ ఆహ్లాదం పంచుతుందని, వ్యాయామం చేసుకునే వారికి మరింత వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. అర్బన్ పార్క్ లో మరిన్ని వసతులు అందుబాటులో తెచ్చేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. అర్బన్ పార్క్ లో అసాంఘిక శక్తులకు ప్రవేశం లేకుండా గట్టి నిఘా ఉంచాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంత సంరక్షణ, విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అడవులకు నష్టం కలిగించే వారి పట్ల అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయన్న, డీఎఫ్ఓ సుధాకర్, సర్పంచ్ లు కే.లత, గంగాధర్, చిన్నా, విద్యార్థిని, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

పేదవానికి చదివే వజ్రాయుధం

janamvelugunews

Published

on

పేదవానికి చదివే వజ్రాయుధం

జనంవెలుగు, నందిపేట్ జూన్ 18:- గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు.

  8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్ లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని,

   సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని,

    నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని,

    ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు.

   అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు.

  అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి, మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

  ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading