Connect with us

Gallery

ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్

janamvelugunews

Published

on

ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్

జనంవెలుగు, తిరుమల:- తిరుమల మొదటి ఘాట్ లో ఎడో మైలు వద్ద ఏనుగులు హల్చల్ చేసాయి. ఏనుగుల గుంపు ఘాట్ రోడ్ దాటాయి. ఏనుగులను చూసిని వాహనదారులు భయాందోళనకు గురైయారు. రంగంలోకి దిగిన వాహనదారులు. టిటిడి పెట్రోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఏనుగులను అడవిలోకి తరిమేసారు. ఘాట్ రోడ్లో దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gallery

రెండు పెద్ద పులుల సంచారం

janamvelugunews

Published

on

రెండు పెద్ద పులుల సంచారం

జనంవెలుగు, నెల్లూరు:- కర్నూలు జిల్లా నుండి ఒక పులి, నల్లమల కారిడార్ నుంచి మరొక పులి జిల్లాలోకి ప్రవేశం. నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు, ఇది కర్నూల్ టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు, మరొకటి గత ఏడాది సెప్టెంబర్ లో నల్లమల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. వన్యప్రాణులు సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు అవి సంచరించే ప్రాంతాలులో నీటి కుంటలు, 18 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని డిఎఫ్ఓ బి.చంద్రశేఖర్ తెలియజేశారు.

Continue Reading

Gallery

సీసీలకు వివో ఏలకు లక్పతి దిధి పై శిక్షణ

janamvelugunews

Published

on

బోథ్ మండలం సమాఖ్య కార్యాలయంలో సీసీలకు వివో ఏలకు లక్పతి దిధి పై శిక్షణ కార్యక్రమము

జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్పతి దీదీ పైన సీసీలకు వివోఏలకు అక్కలకు మహిళా సంఘలో పెద్దలకు లక్షాధికారి చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బోథ్ మండల మహిళా సమాఖ్య ఏఎంపీ మాధవ్ తెలిపారు. ఈ లక్పతి దీదీ శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి డిఆర్డిఏ నుంచి సంస్థ గత నిర్మాణ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ సంస్థాగ త నిర్మాణ ఏపీఎం కిరణ్ కుమార్ మండల స్పెషల్ ఆఫీసర్ పెన్షన్ సెక్షన్ డిఆర్డిఎ డిపిఎం శేష రావు హాజరవుతున్నట్టు ఏపీఎం మాధవ్ తెలిపారు .ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే సీసీలు వివోఎలు శిక్షణకు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Continue Reading

Gallery

జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎంపీపీ అజడే జయశ్రీ కేవల్ సింగ్

janamvelugunews

Published

on

జనం వెలుగు, ఆదిలాబాద్:- తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రోజు పల్లె ప్రగతి సందర్భంగా ఊరూరా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బజార్ హత్నూర్ మండలంలోని మంజరం తాండ గ్రామ పంచాయతీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీపీ అజడే జయశ్రీ కేవల్ సింగ్ హాజరయ్యారు. జాతీయ జెండాను సర్పంచ్ చందర్ సింగ్ ఆవిష్కరించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉత్తమ సేవలందించిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అజడే జయశ్రీ కేవల్ సింగ్, సర్పంచ్ చందర్ సింగ్, ఉపసర్పంచ్ నిస్తే కైలాష్, గ్రామపటేల్ దారు నాయక్, గోతి బసన్ దాస్, మెర్బన్, ధన్ రాజ్, అశ్విన్, ధన్ సింగ్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading