నిజామాబాద్
ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిలో బాలింత మృతి


జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ లోని వంద పడకల ఆసుపత్రిలో గర్భిణీ మృతి శనివారం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన గుండ్ల పెంటల శ్రీలత (27) నిండు గర్భిణి ఓ పండంటి బాబుకు జన్మనిచ్చి తనువు చాలించింది. పెంటల శ్రీలతకు పురిటి నొప్పులు బాగా రావడంతో శుక్రవారం సాయంత్రమే ఆర్మూర్ లోని వంద పడకల ఆసుపత్రికి చేరుకుంది. ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పెంటల శ్రీలతకు గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి నార్మల్ డెలివరీ చేయగా ఓ బాబుకు జన్మనిచ్చింది. గర్భిణీ పెంటల శ్రీలత బాబుకు జన్మనిచ్చిన గంట తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల మృతి చెందినట్లు తెలిసింది. వైద్యురాలు బయటికి రావాలంటూ మృతురాలి బంధువుల ఆందోళన ఆర్మూర్ ప్రభుత్వ దవఖానలోని డెలివరీ ఏరియా వార్డు ముందర శనివారం మృతిచెందిన గర్భిణి పెంటల శ్రీలత బంధువులు ఆందోళనకు దిగారు. గర్భిణీ శ్రీలత ప్రాణాన్ని నిర్లక్ష్య వైఖరితో బలిగొన్న ఆసుపత్రి వైద్యులు సమాధానం చెప్పాలని, గేటు ముందర బైఠాయించారు. శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చిన శనివారం ఉదయం వరకు నార్మల్ డెలివరీల సంఖ్య పెంచుకునేందుకు అమాయకురాలైన గర్భిణీ ప్రాణాన్ని బలితీసుకున్నారని, మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పురిటి నొప్పులు బాగా వస్తున్నాయని సిజేరియన్ చేయాలని ఎంత చెప్పినా వైద్యులు పట్టించు కోవలేదని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వైద్య బృందంపై చర్యలు తీసుకోవాలని మరొక నిండు గర్భిణీ ప్రాణం ప్రభుత్వ ఆసుపత్రిలో పోకుండా కఠిన చర్యలు చేపట్టాలని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి లోపట ఉన్న వైద్యులను గేటు బయటకు రప్పించాలని, ఏకంగా నిండు ప్రాణం పోయినా పెంటల శ్రీలతకు, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆసుపత్రిలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు అధికారులతో సిబ్బందితో ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నిజామాబాద్
ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి


ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
నందిపేట్ జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ వస్తూ వస్తూనే తన మార్కును చూపిస్తున్నాడు. తన ఠాణా పరిధిలోని ప్రజలందరికీ ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పరుస్తూ మత్తుపదార్థాలపై, అగ్ని ప్రమాదాల నివారణపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాలపై, మరి ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విధి నిబద్ధతతో సమాచారం అందుకున్న వెంబటనే పేకాట స్థావరం పై దాడి చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నాడు. శనివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫైర్ సిబ్బందితో కలిసి ఇంటిలో వినియోగించే ఎల్పిజి గ్యాస్ లీకేజీ, ఫైర్ సేఫ్టీ పైన మహిళలకు అవగాహన కల్పించారు. అనుకోకుండా సిలిండర్ లీకేజీ అయి మంటలు సంభవిస్తే భయపడకుండా ధైర్యంగా చిన్న చిట్కాతో ఎలా మంటలను ఆర్పేయవచ్చో ప్రత్యక్షంగా చూయించారు. వచ్చి రాగానే తమ ప్రజలకు ఆర్థిక నేరాలపై, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలతో అవేర్నెస్ కల్పిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.








