నిర్మల్
బాసర శ్రీకృష్ణ ఆలయంలో అఖండ హరినామ సప్తహ కీర్తనా వేడుకలు


జనం వెలుగు, బాసర :- బాసర మండల కేంద్రంలో స్థానిక శ్రీ జ్ఞాన సరస్వతి పవిత్ర పుణ్యక్షేత్రం చదువులు తల్లి అమ్మవారి ఆలయ సమీపం నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న శ్రీ కృష్ణ మందిరంలో అఖండ హరినామ సప్త వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బాసరలో శ్రీకృష్ణ ఆలయంలో బాసర,నేటి అఖండ హరినామ సప్త, కీర్తన, ప్రారంభించిన కుమారి వైష్ణవి దీదీ గౌడ్ నాందేడ్ నిర్మల్ జిల్లా బాసర భుమానంద్, మహారాజ్, గంగాధర్ యాదవ్ ఆధ్వర్యంలో, అఖండ హరినామ సప్త ఏడు రోజులు కొనసాగుతుంది. భజన మండలిలు రోజు కీర్తన కార్యక్రమంతో ఘనంగా కొనసాగుతాయి భక్తులు వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 4 నుండి 6గం?ల వరకు కాకడ ఆరతి, శ్రీ యొక్క అభిషేకము మరియు సూర్య నమస్కారములు, ప్రాచీ సూర్య ఆదిష్టిలి ఉ? 7 నుండి 11 వరమి గీతా పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామములు, శ్రీ సూర్య సిద్ధాంత్ బోధ గ్రంథము వ్యాసపేట సంచాలకులు హ..పా. పాండురంగ్ రావ్ సాహిబ్ నాథన్ వర్గావ్ పేట్ మరియు హ.భ.పా. మారుగొండ సాయన్న మహారాజ్ భోసికర్ వారి తరపున ఉంటుంది. అలాగే 11 నుండి 12 గ్రంథ విశేషన్ ప్రవచనం ఉంటుంది ను 12 నుండి 2 వరకు భోజనము, విశ్రాంతి ఉంటుంది. 2 గం?ల నుండి సా? 4 గంఎఎల వరకు శ్రీమద్ భాగవత కథ అమృత్ కృతకార్ : కుమారి వైష్ణని వీధీ గౌడ్ ఎంపర్. -అధ్యక్షులు సా సులోచనబాయి గోవింద్ సౌకార్ బచ్చువార్ మోక్ష్మి ఆయోజకులు మావులి మహారాణి. శ్రీ (భూమిపుత్రులు) భూమానంద్ స్వామి యాదవ్ మహారాజ్ శ్రీ కృష్ణ మందిరం బాసర్ సంయోజకులు – గోపాలకృష్ణ మందిర్ సంస్థానం బాసర్, సమన్వయ సమితి మరియు భక్తులు అలాగే వాల్మికి. ఋషి సేవా సంఘం ముధోల్, శ్రీ సంత్ గాడ్గే బాబా సేవా సంఘం సావర్ ప్మేట్. తా? భోకర్ మరియు సమస్త యాదవ్ గ్రూప్, శ్రీ కృష్ణ సేవా సంఘం తెలంగాణ మరియు మహారాష్ట్ర కార్యక్రమాల వివరములు: సాయంత్రం 6 నుండి 7 పరిపాటి అలాగే రాత్రి 9 నుండి 11 గం?ల వరకు కీర్తనలు కొనసాగుతాయని, అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, జిడ్డు, సుభాష్ యాదవ్ తెలియజేశారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








