నిర్మల్
కుటుంబం ఊపిరి తీసిన సమస్య


అయ్యో పాపం
పిల్లలతో సహా తల్లి బాసర గోదావరిలో ఆత్మహత్య
జనం వెలుగు, బాసర:- నిర్మల్ జిల్లా బాసర మండలంలో పవిత్ర పుణ్య నది గోదావరిలో సోమవారం ఓ తల్లి ఇద్దరు కొడుకు కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకాలం రేపింది నవ మాసాలు మోసి చిన్న నుండి పెద్దగా చేసిన ముర్రిపాలు తాగిన కన్నతల్లి చిన్నారులు అభం శుభం తెలియని వారితో సోమవారం బాసరకు చేరుకొని గోదావరి నది రెండవ ఘాట్ వద్ద నదిలో దూకి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ముధోల్ సీఐ వినోద్ రెడ్డి వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన మానస 27 కుమారుడు బాలాదిత్య 9 కుమార్తె భాగ్యశ్రీ 5 వీరిది మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండారుపల్లి గ్రామం కాగా గత కొన్ని సంవత్సరాలు అక్కడే భర్తతో సంసారం చేస్తుండగా అకస్మాత్తుగా భర్త వెంకటేష్ గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద నిజాంబాద్ కు వచ్చిన మానస తన తమ్ముడు నవీన్ నిజామాబాద్ పెద్ద బజారులో ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూ ఉండగా తమ్ముడికి కూడా సంతనం లేకపోవడంతో ప్రేమతో చెల్లె కూతుర్లను చూసుకుని వారు నిజాంబాద్ పట్టణంలోని రాధాకృష్ణ ప్రవేటు పాఠశాలలో భావ్యదీత్య భవ్యశ్రీ చదువుకునేవారు తల్లి మనస ఎల్విఆర్ షాపింగ్ మాల్ లో గుమస్తాగా పనిచేస్తుండగా ఇద్దరు కూతురు కుమార్తెను చదువుకునే బ్యాగు తో పాటు పుస్తకాలు పెన్నులు టిఫిన్ డబ్బాతో తీసుకువచ్చి బాసరకు రాగా మొదటిగాటు వద్ద దిగి వాళ్ళని ఏడుస్తుండగా కూడా బలవంతంగా లాక్కుంటూ గోదావరి నదిలో ఉదయం దూకినట్లు స్థానికులు తెలిపారు దీనితో అక్కడున్న భక్తులు బాసర గ్రామస్తులు కన్నీరు మూడు శవాలను చూసి శోకసముద్రంలో మునిగారు అనంతరం బాసర మహేష్ శివ పంచాంగం చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు ఒక ప్రకటనలు తెలిపారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








