Connect with us

నిర్మల్

బాసరలో ఘనంగా 27వ బ్రహ్మీ వార్షికోత్సవాలు

INTHIYAZ MIRZA

Published

on

జనం వెలుగు, బాసర:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువులపల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం పరిధిలోని నైమిశారణ్యం భవనం నందు ప్రతి సంవత్సరం జరుపుకునే బ్రహ్మీ తీర్థ 27వ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురూజీ ఆర్కే రావు పత్రికలతో మాట్లాడుతూ మాఘమాస సంవత్సరంలో భక్తులకు ముఖ్యంగా చిన్నారులకు బ్రహ్మితీర్థం తీసుకోవడంతో వారు విద్య బుద్ధులతో పాటు మంచి మహోన్నత కార్యక్రమాలు చేపడతారని కుటుంబంలో సుఖశాంతులతో ఉండడమే కాకుండా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు హిందూ ధర్మం యొక్క సమాజంలో మనం ఉన్నమంటే ముఖ్యంగా సరస్వతి క్షేత్రంలో మహాభారత కాలంలో ఉన్న ఈ పుణ్యభూమి లో ఉండడం మనం చాలా గొప్పవాళ్ళమని అదే విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవడం ఎంత అవసరం ఉందని ముఖ్యంగా యువకులు చెడు మార్గాన్ని విడనాడి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు అంతకుముందు నైమిశారణ్య భవనంలో పదిమంది ఉపనాయనాలతో పాటు మహా చండీయాగం చేపట్టారు. మహారాష్ట్ర మన రాష్ట్రం నుండి కాకుండా వేద పండితులు పాల్గొని వేదమంత్రాలతో యాగంలో పాల్గొన్నారు మహోత్సవాలను శనివారం నాలుగు గంటలకు పుణ్య నది గోదావరిలో ఆర్కే రావు ఆధ్వర్యంలోని భక్తులకు బ్రహ్మీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీనితో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భ్రమి తీర్థాన్ని స్వీకరించారు అనంతరం నేరుగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుని తమ ముక్కులను తీర్చుకున్నారు నేరుగా నైమిశారణ్య భవనానికి చేరుకొని అక్కడ యజ్ఞం మరియు తదితర కార్యక్రమంలో పాల్గొని మా అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి సన్మాన కార్యక్రమాలు పొందారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కలను తీర్చుకున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading