నిర్మల్
పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి


విద్యార్థుల సంఖ్యను పెంచేందుకే మన ఊరు మనబడి-ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
జనం వెలుగు, లోకేశ్వరం:- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాలమౌలిక వసతులను కల్పించి విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకే కెసిఆర్ ప్రభుత్వం మన ఊరు మనబడి ప్రణాళిక రూపొందించిందని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని హద్గాం, రాయాపూర్ కాండ్లీ, రాజూర, గ్రామాల పాఠశాలలలో మన ఊరు మన బడి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కెసిఆర్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యాబోధనతోపాటు, అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి ప్రతి పేదవిద్యార్థికి ఉన్నత విద్యను అందించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మధ్యాహ్నం భోజనం, మన ఊరు మనబడి ప్రణాళికకు శ్రీకరం చుట్టి నిర్వహిస్తుందని తదితర విషయాలను పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలిత భోజన్న, మండల తెరాస (బి.ఆర్.ఎస్.) కన్వీనర్ శ్యాంసుందర్, సింగిల్విండో చైర్మన్ రత్నాకర్ రావు, ఎమ్మార్వో సరిత, ఇన్చార్జ్ ఎంపీడీవో సాల్మన్ రాజ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు రాజేష్ బాబు, మెండేశ్రీధర్, నాలం గంగాధర్, గన్ను నర్సారెడ్డి, బండి ప్రశాంత్, దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








