Connect with us

నిజామాబాద్

హక్కులు దక్కక, దిక్కు తోచక…

janamvelugunews

Published

on

జనం వెలుగు, పోతoగల్:- కుల వృత్తిని నమ్ముకుని బతుకుదెరువు కొనసాగిస్తుంటే మా సొంత స్థలంలో గ్రామ సర్పంచ్ అక్రమ కట్టడాలకు సహకరిస్తుండు అదేంటని ప్రశ్నిస్తే బూతు పురాణాలతో పొతంగల్ గ్రామ సర్పంచ్ తిట్ల పురాణం చేస్తుండు బెదిరిస్తుండని, క్రిమి సంహారక మందు డబ్బాతో నాయి బ్రాహ్మణ కుటుంబం నిరసన చేశారు. నాయి బ్రాహ్మణ కుటుంబంపై సర్పంచి చిన్నచూపు చూస్తూ ఈసడిస్తున్నాడని, బెదిరింపులు చేస్తున్నాడని మందు డబ్బాతో నిరసన చేశారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని నాయు బ్రాహ్మణ కుటుంబం తమకు గ్రామ సర్పంచ్ వర్ని శంకర్ అన్యాయం చేస్తున్నాడని, తిట్ల పురణం చేస్తున్నాడని, ఈసరిస్తున్నాడని, బెదిరింపులు చేస్తున్నాడని తమపై గుండాయిజం చేస్తున్నాడని పురుగుల మందు డబ్బాతో నాయి బ్రాహ్మణ కామయ్య కుటుంబం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుంచి తమకు ప్రభుత్వం పట్టా ఇవ్వడంతో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నామని, తన సొంత స్థలంలో ప్రస్తుతం ఉన్న ఫలంగా గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి వచ్చి ఇతరులకు షెడ్డు వేయడానికి అనుమతులు ఇస్తున్నారని,తన సొంత స్థలంలో ఇతరులు షెడ్డు వేయడానికి ఎలా అనుమతులు ఇస్తారని, తనకు టాక్స్ రిసిప్టులు, ధ్రువ పత్రాలు ఉన్నప్పుడు ఏ విధంగా గ్రామ సర్పంచ్ ఇతరులకు అనుమతులు ఇస్తారని వారు ప్రశ్నించామన్నారు. అదేమిటని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యం చేస్తున్నాడని బెదిరింపులు చేస్తున్నాడని గుండాయిజం చేస్తున్నారని వారు తమ గోడును మీడియాకు వెల్లడించారు. తాము కుల వృత్తిపైనే ఆధారపడి బతుకుదెరువు కొనసాగిస్తున్నామని తమ కుటుంబంపై గ్రామ సర్పంచ్ వర్ణిశంకర్ కక్ష సాధింపులు చేస్తున్నారని అన్నారు. తమ సొంత స్థలంలో షెడ్డు వేస్తే పురుగుల మందు తాగి చనిపోతామని వారు రోధిస్తూ తమ గోడును వెల్లడించారు. గ్రామ సర్పంచ్ వర్ని శంకర్ పదజాలలు తమకు ఆవేదనకు గురి చేస్తున్నా పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. నాయి బ్రాహ్మణ కుల వృత్తిపై ఆధారపడి బతుకుతున్నామని తమపై సర్పంచి వర్ని శంకర్ చిన్న చూపు చూడడం బాధాకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శిని చరవాణి ద్వారా వివరణ కోరగా అది గ్రామపంచాయతీకి సంబంధించిందని సమాధానం ఇచ్చారన్నారు. తాము వారిపై తిట్ల పురాణం చేయలేదని సమాధానం ఇచ్చారు, షెడ్డు వేసే వ్యక్తి గత 8 సంవత్సరాలు నుంచి అక్కడ ఉన్నాడని అది గ్రామపంచాయతీ స్థలం కాబట్టి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా వివరణ కోసం పొతంగల్ గ్రామ సర్పంచి వర్ని శంకర్కు చరవాని ద్వారా ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

janamvelugunews

Published

on

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.

 మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్

 ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

 ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

janamvelugunews

Published

on

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు

నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.

Continue Reading