Connect with us

నిజామాబాద్

8000 కోట్ల కుంభకోణాన్ని కాంగ్రెసు ప్రభుత్వం చేసింది

janamvelugunews

Published

on

హామ్ టెండర్లను రద్దు చేయాలి

ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి,పూటకో కుంభకోణం.

మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి.

జనం వెలుగు ఆర్మూర్:- హైబ్రిడ్ అన్యూటి మోడ్(హమ్) టెండర్లలో సుమారు 8000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభు త్వం చేసిందని మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించాడు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. హమ్ లో కిలోమీటర్ కు 85 శాతం అంచనా వ్యయాన్ని పెంచి 9000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే రోడ్లకు 17000 కోట్లకు రుపాయలకు టెండర్లను పిలిచారని ఆయన విమర్శించాడు. దీంతో 8000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ కాంగ్రెసు ప్రభుత్వం లూటీ చేస్తొందని ఆయన తెలిపాడు. మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలో సిఎం, మంత్రి వివాదంలో అధికారిని బలిపశువును చేశారని ఆయన అన్నాడు. సిఆర్ ఎఫ్ కింద కిలోమీటర్ కు ఒక కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే హమ్ ఇచ్చిన టెండర్లలో కిలో మీటర్ కు 3 కోట్ల 30 లక్షలు ఖర్చు అవుతుందని, సిఆర్ఎఫ్ కింద ఇచ్చిన రోడ్ల పనుల టెండర్ల జిఓకు, హమ్ జిఓకు కేవలం పది రోజుల తేడాతో వెలువడ్డాయని, సిఆర్ఎఫ్ కింద ఇచ్చిన జిఓలో కిలో మీటర్ కు ఒక రేటు, హామ్ జిఓలో కిలో మీటర్ కు మరో రేటు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించాడు. హామ్ కింద కిలోమీటర్ రోడ్డు మెయింటనెన్స్ కు మరో 2 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయిస్తున్నారని, దీంతో హామ్ కింద కిలోమీటర్ రోడ్డుకు సుమారు 6 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆయన తెలిపాడు.హామ్ లో ప్రభుత్వం 40 శాతం, ప్రైవేటు సంస్థలు 60 శాతం భరిస్తాయని,ప్రైవేటు సంస్థలు బ్యాంకుల నుండి తెచ్చే అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటు న్నందున హామ్ ప్రజల మీద పెను భారం మోపుతొందని తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయులకు ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్న హామ్ టెండర్లపై సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశాడు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం లేదని హామ్ కింద మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఎలా చెల్లిస్తారని, హామ్ రోడ్ల నింబందనల వలన చిన్న కాంట్రాక్టర్లకు నష్టం, కష్టం జరిగే విధంగా ఉన్నాయని ఆయన వివరించాడు.ఈ విలేఖరుల సమావేశంలో ఎంఎల్ఏలు కాలేరు వెంకటేష్, డాక్టర్ కె సంజయ్, గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ ఆయాచితం శ్రీధర్, బిసి కమిషన్ మాజి సభ్యుడు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

janamvelugunews

Published

on

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి

janamvelugunews

Published

on

మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, జూన్ 16: మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.

     ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు,

      అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ,టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

janamvelugunews

Published

on

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులలో చేర్పించాలి

ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు

నిజామాబాద్, జూన్ 17: భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగుతోందని తెలిపారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు.

ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ వారితో భేటీ అయ్యారు. తమ పిల్లలను ప్రైవేటు బడుల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల భారం ఎక్కువగా ఉండడమే కాకుండా, ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పిస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొనగా, ఈ విషయాలను వివరిస్తూ మిగితా వారిని కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.

   ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, పదవ తరగతిలో 87 శాతం సగటు ఉత్తీర్ణత సాధించిన బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకుని చక్కటి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.

నాణ్యమైన విద్యా బోధనతో పాటు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపుతున్నారని అన్నారు. ఇదివరకు పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుకుంటారనే భావన ఉండేదని, ప్రస్తుతం ఆర్ధిక స్థోమత కలిగిన వారు కూడా నాణ్యమైన విద్య కోసం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుండడం శుభ పరిణామమని అన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ తత్వాన్ని పెంపొందించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో విద్యా ప్రమాణాలు, బోధనను మెరుగుపరుస్తోందని, ఉపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలను పెంపొందేలా శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులతో పాటు అల్పాహారం, మద్యాహ్న భోజనం అందిస్తోందని అన్నారు.
కాగా, బోర్గాం(పి) పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో, బడికి ఆనుకుని ఉన్న స్థలాన్ని సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థిని, విద్యార్థుల బోధనా సామర్ధ్యాన్ని పరిశీలించి, బహుమతులు అందజేశారు. బాలబాలికలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, మోపాల్ తహసిల్దార్ రేఖ, ఎం.ఈ.ఓ సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.

Continue Reading