Connect with us

నిర్మల్

సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

INTHIYAZ MIRZA

Published

on

సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి

జనం వెలుగు, నిర్మల్:- ముఖ్యమంత్రి హామీ మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని క్రమబద్ధీకరణ చేయాలని, అప్పటివరకు కనీస వేతన పే స్కేలు అమలు చేయాలని, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమగ్ర శిక్షలో గత 15ఏళ్లుగా వివిధ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20,000 మంది ఉద్యోగులు ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్నారని వీరందరిని క్రమబద్ధీకరించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ లోపుగా సెర్ప్ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా వేతన పే స్కేల్ అమలు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల్లో వందకు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున వీరికి కనీస సహాయం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య భీమాకు ఐదు లక్షలు ,జీవిత బీమాకు పది లక్షల రూపాయల సౌకర్యం ప్రతి ఉద్యోగి కల్పించాలని కోరారు. సమగ్ర శిక్షలో ఉద్యోగులందరూ నిరుపేద , మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని, 80 శాతం మహిళా ఉద్యోగులే పని చేస్తున్నారన్నారు. వీరి ఆర్థిక సామాజిక స్థితిగతులు ,మహిళా సాధికారతలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని కోరారు. అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు అన్ని విభాగాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు , సభ్యులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading