నిజామాబాద్
| Nandipet అడుగడుగునా హర హర మహాదేవ నినాదాలు


Views: 245
అడుగడుగునా హర హర మహాదేవ నినాదాలు
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని గ్రామ గ్రామాన మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మండల కేంద్రంలోని అతి పురాతనమైన నందికేశ్వర, నవరత్నాల, సాంబయ్య ఆలయాలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఆదివారం అన్నదానాల వద్ద దీక్ష విరమించారు.
అలాగే ఉమ్మెడ గ్రామ శివారు గోదావరి నది ఒడ్డున గల అతి పురాతనమైన స్వయంభు ఉమామహేశ్వర ఆలయంలో కూడ ఉమ్మెడ విడిసి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలను జరిపారు. నందిపేట మండల కేంద్రంలో నవసిద్ధుల పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక కొత్తదనంతో భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపేందుకు ఆలయ కమిటీ వారు ఎంతగానో కృషి చేస్తారు. గతేడాది ఐదు లక్షల రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేయగా ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర క్షేత్ర నర్మదా నది నుండి 56వేల భాన లింగాలను తెచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నదే మా చివరి సంకల్పమని, ప్రతి ఒక్క వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయాలని, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలిగిన నాడే ఆ ఈశ్వరుని కృప సిద్ధిస్తుందని తెలిపారు.
అలాగే మండల కేంద్రంలోని నంది గుడి, నవరత్నాల, సాంబయ్య ఆలయాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంది గుడి క్షేత్రంలోని నందికేశ్వర విగ్రహం ఏకశిలా విగ్రహం అని గతంలో ఈ విగ్రహం ఎంతో చిన్నగా ఉండేదని ఆనంది కేశ్వర అనుగ్రహంతో దినదినం ఆలయం అభివృద్ధి చెందుతుందని, ఆలయంతో పాటు గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని, నంది పెరగడం వల్ల ఆలయాన్ని రెండుసార్లు నూతనంగా నిర్మించడం జరిగిందని, ఆ బసవయ్య పేరుతోనే మా నందిపేట గ్రామం గా పిలుచుకోవడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు పెద కాపు సుమన్ తెలిపారు.
నిజామాబాద్
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం


Views: 4
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు


Views: 224
యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు
నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన


జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.
స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.
నిజామాబాద్
|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి


Views: 90
ఘనంగా చత్రపతి శివాజీ జయంతి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.















