నిర్మల్
నేటి తరం రాజకీయ రంగం


జనం వెలుగు :-
____నేటి తరం రాజకీయం____
ఆ రోజుల్లోనైతే ప్రజల కోసం ప్రజాభివృద్ధి కోసం ఎన్నో సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లొ గొప్పగా రానించి మంచి పేరు ప్రక్యాతలను సాదించుకున్నారు. ఎందరో గొప్ప నాయకులుగా రాజకీయ చరిత్రలో ఎదిగారు. అనునిత్యం వారి రాజకీయం , కేవలం ప్రజా సేవకే అంకితమని భావించి , ప్రతి నిమిషం వారి జీవన రంగాన్ని చివరి వరకు ప్రజల కోసమే గడిపారు. వారిని నమ్ముకున్న ప్రజల మధ్యలోనే తుది శ్వాసను విడిచారు. అందుకే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అలాంటి గొప్ప రాజకీయ నాయకుల విగ్రహాలను ప్రతిష్టాపించి ప్రజలు వారిని దైవంల కొలుస్తున్నారు, జయంతులను వర్దంతులను చేస్తున్నారు. అలాంటి నాయకుల గొప్ప చరిత్రకి నిలువెత్తు నిదర్శనం, మనం చూసే విగ్రహాలు, జయంతులు , వర్దంతులు, చదువుతున్న పాఠ్యపుస్తకాలె సమాధానం. కానీ నేటి తరం రాజకీయం అలా కాదు, అంత అదోమయం.ఎక్కడ చూడు అక్రమాలు, అత్యచారాలు , దోపిడిలు , మద్యం , మానబంగాలు ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ఎన్నెన్నో అరచకాలు. ఈ దేశంలో ఏ ఒక్క ప్రస్తుత రాజకీయ నాయకుడు కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రాజకీయం లోనికి రావడమనేదే లేదు. ఎవరి స్వలాభాల కోసం వారు ఎవరి స్వార్ధం కోసం వారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. నాడు రాజకీయం అంటేనే ప్రజా సేవ చేయడానికి రాజకీయం లోకి వచ్చెవారు.కానీ నేడు సంపాదించడానికె వస్తున్నారనేది పలువురి అభిప్రాయం. ఏది ఏమైనా భావి భారత తరానికి నేటి కాలం నేర్పించించాల్సింది మేలు మాత్రమే కానీ కీడు కాదు అనే వాస్తవాన్ని చరిత్రలు సైతం స్పష్టంగా వివరించాయి.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








