నిర్మల్
ప్రజా గోస – బిజెపి భరోసా


జనం వెలుగు, నందిపేట్:- శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో భాగంగా నేడు నందిపేట్ పట్టణం 150, 151, 152 భూత్ ల శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే భూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించాలని బిజెపి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలోని 11 వేల శక్తి కేంద్రాలలో బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ చైతన్య పరచడమే లక్ష్యంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసిందన్నారు. బిఆర్ఎస్ నాయకులకు ఎన్నికలు వస్తే తప్ప ప్రజలు గుర్తుకురారని, ఎన్నికల ఉన్నపుడు గంపగుత్తగా హామీలు ఇవ్వడం గెలిచిన తర్వాత హామీలను మర్చిపోవడం శరామాములు అయిపోయిందని. ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయలేదని, దళిత బంధు సైతం నిజమైన అర్హులకు కాకుండా పింకు కండువా వేసుకున్న వారికే ఇస్తున్నారని, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు పంపిణీ చేయట్లేదని అన్నారు. బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రానికి వేల కోట్లు కేటాయించిన కేసీఆర్, ఆయన ఎమ్మెల్యే లు కేంద్రం ఏమి ఇవ్వట్లేదంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోధన్ నాయకులు అడ్లూరి శ్రీనివాస్, ఒబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా కార్యదర్శి సురేందర్, నియోజకవర్గ కన్వీనర్ పాలేపు రాజు, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మండల అధ్యక్షులు భూతం సాయి రెడ్డి, నందిపేట్ ఎంపిటిసి – 1 ఎలిగేటి రాజు, శక్తి కేంద్రం ఇంచార్జ్ సిరిపురం రవీందర్, 150 వ భూత్ అధ్యక్షులు చింత శ్రీను, 151 వ భూత్ అధ్యక్షులు ముత్యం, 152 వ భూత్ అధ్యక్షులు ఏ శ్రీను బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








