నిజామాబాద్
పేదల భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు


రైతుల డబ్బులను ఎగబడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
రైతులు తన పొలం వద్ద కుటుంబీకులతో పొలం వద్ద ధర్నా
జనం వెలుగు, మాక్లూర్:- మాక్లూర్ మండలం మాణిక్ బండారు గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మణ్ ( లచ్చన్న) S/O చిన్నన్న వీరి భూమి 554 లో గల 11 గుంటల భూమి అమ్మగా మిగిలిన 17 గుంటలకు మా కబ్జాలో భూమి పద్దెనిమిది లక్షలకు ఒప్పందం బాణాల లక్ష్మారెడ్డితో కుదిరింది. లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది కాగా బాణాల లక్ష్మారెడ్డి పలు కారణాల వల్ల మా యొక్క భూమి ప్రేమ్ సాగర్ ( గండ్రి ప్రాజెక్టు ) వారికి అమ్మినారు మిగిలిన 17 లక్షల కొరకు బాణాల లక్ష్మారెడ్డి దగ్గరికి వెళ్తే లక్ష్మారెడ్డి అజిత్ రావు దగ్గరకు వెళ్లి అడగమని పొలానికి సంబంధించిన పత్రాలు అతని ఇచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పాను అని చెప్పి అజిత్ రావు దగ్గరకు పంపగా అతను మాకు ఏం చెప్పలేదు ఏం లేదు అనడంతో సుంకరి లచ్చన్న అటు బాకీల బాధతో ఇటు వీరి టార్చర్ తో ఆందోళనకు గురై పక్షవాతం బారిన పడి కాళ్లు చేతులు పనిచేయకుండా అయి పోయాయి దీనికి సంబంధించి పలుమార్లు కలెక్టరేట్ మరియు మండల ఆఫీస్ కు తిరిగిన ఎవ్వరు స్పందించలేరు. కావున ఇది తప్ప మాకు మరెక్కడ భూమి లేదు. ఈ డబ్బులు రాకపోతే నాకు నా కుటుంబ సభ్యులకు చావు తప్ప మరో మార్గం లేదు అని సుంకరి లచ్చన్న చెప్పడం జరిగింది. పేదల భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల డబ్బులను ఎగబడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నిజామాబాద్
ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి


ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
నందిపేట్ జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ వస్తూ వస్తూనే తన మార్కును చూపిస్తున్నాడు. తన ఠాణా పరిధిలోని ప్రజలందరికీ ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పరుస్తూ మత్తుపదార్థాలపై, అగ్ని ప్రమాదాల నివారణపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాలపై, మరి ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విధి నిబద్ధతతో సమాచారం అందుకున్న వెంబటనే పేకాట స్థావరం పై దాడి చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నాడు. శనివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫైర్ సిబ్బందితో కలిసి ఇంటిలో వినియోగించే ఎల్పిజి గ్యాస్ లీకేజీ, ఫైర్ సేఫ్టీ పైన మహిళలకు అవగాహన కల్పించారు. అనుకోకుండా సిలిండర్ లీకేజీ అయి మంటలు సంభవిస్తే భయపడకుండా ధైర్యంగా చిన్న చిట్కాతో ఎలా మంటలను ఆర్పేయవచ్చో ప్రత్యక్షంగా చూయించారు. వచ్చి రాగానే తమ ప్రజలకు ఆర్థిక నేరాలపై, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలతో అవేర్నెస్ కల్పిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.








