Connect with us

నిజామాబాద్

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

suresh sitharla

Published

on

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

జనం వెలుగు, నిజామాబాద్:-  తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సును విజయవంతం చేయలని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిజామా బాద్ జిల్లా అధ్యక్షుడు డి. ఎల్. యన్. చారి. పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 12 హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే సమావేశానికితెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని అన్నారు. నామినేటెడ్ పదవులలో తెలంగాణ ఉద్యమకారులకు, ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలనితెలిపారు. దగా పడ్డ ఉద్యమకారులంతా ఏకమై మరో ఉద్యమానికి సిద్ధం అవ్వాలని, కులాలకు పార్టీలకు అతీతంగా తరలిరావాలని అన్నారు. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఉద్యమకారులకు ఎ లాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యమ అంశాన్ని ఎజెండగా మార్చడంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజయవంతమైనది. భారీ ఎత్తున ఉద్యమకారుల ఐక్యతని మనం సంఘటితంగా చాటి చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు

janamvelugunews

Published

on

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లచే ప్రదానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు (Individual Highest Blood Donor Motivator) అవార్డును రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ అందుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు  లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు.

ఈ సందర్భంగా నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అవార్డు గ్రహీత ప్రశాంత్‌ను అభినందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరాయంగా రక్తం అందుబాటులో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రజావాణికి 135 ఫిర్యాదులు

janamvelugunews

Published

on

ప్రజావాణికి 135 ఫిర్యాదులు

నిజామాబాద్, జూన్ 15 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్.సీ.ఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కాగా, ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ బీ.ఎల్.ఓ లను సంప్రదించి మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading