నిర్మల్
బంధు స్కీములు కాదు.. ఉజ్వల భవిష్యత్ కోసం పాటుపడదాం.!!!


బంధు స్కీములు కాదు.. ఉజ్వల భవిష్యత్ కోసం పాటుపడదాం.!!!
బహుజన రాజ్యంతోనే బడుగుల బలహీన మార్పు-జగన్ మోహన్
జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- నిర్మల్ నియోజకవర్గం లోని నిర్మల్ మండలం కడ్తాల్, గంజాల్ గ్రామాలలో బిఎస్పీ ఆధ్వర్యంలో గడప గడపకు బిఎస్పీ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు,ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ మాట్లాడుతు ఆయా పార్టీలల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను కలిసి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన,ముందుచూపు, పనివిధానం గూర్చి తెలియజేసియడం జరిగింది. గతంలో ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు తాను బీసీ,ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల్లో ఉన్న పేద పిల్లలకు తను చేసిన సేవలు ఎంతో గొప్పవని, తినడానికి తిండిలేని నిరుపేద బిడ్డలను అమెరికా లండన్ లాంటి గొప్పగొప్ప దేశాలకు ఉన్నత విద్యాకోసం పంపించడం జరిగింది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తొమ్మిది సంవత్సరాల కాలంలోనే
విద్యార్థులకు అంత మేలు చేయగలిగితే
బిఎస్పీ జాతీయ అద్యక్షురాలు కుమారి మాయావతి బిఎస్పీ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే అని ఒకవేళ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన అట్టాడుగు వర్గాల్లో పేదరికం అనేదే లేకుండా చేస్తాడని కొనియాడారు. ఆధిపత్య అన్ని పార్టీల నాయకులు ఎలక్షన్ రాగానే రావడం.. మీకు పింఛను, రైతు బంధు, దళిత బంధు, బిసి బంధులంటూ ఆశలు చూపి బహుజనుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఏన్నికల్లో ఓట్లను దండుకొని పోవడం రివాజుగా మారిందన్నారు. మెజారిటీ ప్రజలైన నిరుపేదల జీవితాలను మార్చుటకు ఇంతవరకు ఏ ఆధిపత్య పార్టీ కూడా చిత్తశుద్ధితో ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించలేదని అన్నారు. పేద వర్గాల ప్రజలను సంపన్న వర్గాలుగా తీర్చిదిద్దె దూరదృష్టి కలిగిన డా.. ఆర్.ఎస్ .ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం బలపరిచి బందు స్కీములు కాదు..!! ఉజ్వల భవిష్యత్తు కోసం ఐక్యమై బహుజన రాజ్యం కోసం పాటు పడదాం అని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మార రాజన్న, ప్రధాన కార్యదర్శి గుండ సతీష్, మహిల కన్వీనర్ ఎస్. కె.లక్ష్మి, నియోజక వర్గ అధ్యక్షులు నిమ్మ గణేష్,నేర రాజన్న, ముల్కల సాయన్న,గంగామణి, కరుణ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








