Politics
బిఆర్ఎస్,బిజెపి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి


బిఆర్ఎస్,బిజెపి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్రకమిటీ పిలుపునిస్తోంది
జనం వెలుగు నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్:- రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్.బిజెపి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్రకమిటీ పిలుపునిస్తోంది. శుక్రవారం మంచిర్యాల కేంద్రంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం టీఎస్ యుఎస్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య మాట్లాడుతూ దేశములో మత తత్వం, రాష్ట్రంలో, నియంతృత్వం, రాజ్యమేలుతున్నాయి. ఈ రెండూ, దేశానికి ప్రమాదకరమే. ముఖ్యంగా, బిఆరెస్ పార్టీ. గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు విలువ ఇవ్వని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలాలు ప్రజలకు అందివని ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది అదేవిధంగా కేంద్రంలో మనువాద మతోన్మాద ప్రభుత్వం వివిధ మతాల మధ్య కల్లోలం సృష్టించి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర పన్నుతఉన్నది ఈ రెండు ప్రభుత్వాల మూలంగా ఈ దేశంలో ఉన్న 90% శాతం పేద ప్రజల బతుకులు బజారునబడే ప్రమాదం ఏర్పడ్డాది అందువల్ల అందువల్ల అనివార్యంగా గుడిలో మెల్లగా కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా భేషరాతుగా బలపరచవలసిన పరిస్థితి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘానికి ఏర్పడినదీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, నీళ్లు, నిధులు, నియామకాలు, మావి మాకే దక్కాలంటే సమైక్యాంధ్ర నుండి తెలంగాణను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, 12,00 మంది, విద్యార్థుల బలి దానాలతో సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా, ఉద్యమ పార్టీగా, ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని అధ్యక్షుడిగా నియమించి, ఆ పార్టీ అండగా ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, విద్యార్థులు, కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, ఐక్యంగా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, ఇప్పుడు తన కుటుంబ పాలనలో నలుపేస్తూ, ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని, బిఆరెస్ పార్టీ గా మార్చి, తెలంగాణ ప్రజల అస్తిత్వం మీద దెబ్బ కొట్టారు.అలాగే, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన చేస్తూ, ప్రజల హక్కులను కాల రాస్తూ, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ, నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తున్నారు. అందులో బాగంగానే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రూ,65,000,కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన, కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్, పేరుతో, రూ,1, 30,000,కోట్ల, రూపాయలు వెచ్చించి, కాళేశ్వరం మేడిగడ్జ వద్ద, నిర్మించడం జరిగింది. ఆ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద అద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పుకొని,తనే ఇంజనీర్ గా పనిచేసి ఇసుక దిబ్బ మీద గాలిమేడలు కట్టినట్లు, నాసిరకం పనులు చేసి, రూ,50, 000,కోట్ల, రూ, లు, కమీషన్లు దొబ్బి, ప్రాజెక్టు కూలిపోయే విధంగా, నిర్మాణం చేయడం, నిధులు నీళ్ల పాలు, కమీషన్లు, కల్వకుంట్ల కుటుంబం పాలు, అన్నట్లుగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, నెహ్రూ కాలంలో కట్టిన నాగార్జున సాగర్, సింగూర్, నెట్టెంపాడు, లాంటి ప్రాజెక్టులు, ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మేడిగడ్జ వద్ద కట్టిన ప్రాజెక్టు మాత్రం కట్టిన, మూడు సంవత్సరాలకే పిల్లర్లు కుంగి కూలడానికి సిధ్దముగా ఉండడం, అదేవిధంగా అన్నారం బ్యారేజీ కి బుంగలు పడడం, కన్నెపెల్లి పంప్ హౌస్, గోడ కూలి, 5,బాహు బలి, మోటార్లు ద్వంసం కావడం, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో కట్టిన ఈ ప్రాజెక్టు, కూలిపోవడానికి కారణం మానవ తప్పిందంగా భావిస్తూ, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించి, ప్రాజెక్టు కూలడానికి కారణమైన ముఖ్యమంత్రి, రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలలో పాల్గొనే అర్హత లేదని భావిస్తూ, ఈ ఘటనకు కారణమైన బిఆరెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, అదే విధంగా బిజెపి పార్టీ రాష్ట్రంలో కెసిఆర్ దోపిడిని వెనుక వేసుకోస్తూ కెసిఆర్ దోపిడిని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం చెందింది బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ వాళ్ల జెండా రంగులు వేరైనా ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆ రెండు పార్టీలకు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు నిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నీరటి రాజన్న, టి ఎస్ యు ఎస్ రాష్ట్ర కోకన్వీనర్ దేవి సత్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి కుమారస్వామి ప్రచార కార్యదర్శి వెంగళ కనకన్న రాష్ట్ర నాయకులు గోడిసెల శ్రీహరి ఎం ఎఫ్ బెగ్,కాసర్ల ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ మాదరబోయిన వెంకన్న చంద్రశేఖర్ ఈ శ్రీధర్ పోషన్న తదితరులు పాల్గొన్నారు.
Politics
| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది


తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.
జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.
సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.
ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.
Politics
| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి


బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు
జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం
మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.



Politics
| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది


మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం
జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.
చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.
*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం











