Connect with us

నిర్మల్

కొట్టేసిన సెల్ ఫోన్లతో ఏంచేస్తున్నారో తెలుసా

suresh sitharla

Published

on

కొట్టేసిన సెల్ ఫోన్లతో ఏంచేస్తున్నారో తెలుసా

పోలీసుల అదుపులో మైనర్ బాలుడు

జనంవెలుగు, అనిల్ నిర్మల్:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో చోరీ ఘటనలు కలకలం సృష్టించాయి. మొబైల్ ఫోన్లు చోరీ చేసి, వాటిలోని డిజిటల్ పేమెంట్ యాప్‌లను ఉపయోగించి డబ్బులు బదిలీ చేసిన మైనర్ బాలుడిని నిర్మల్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై నిర్మల్ రూరల్ సీఐ మున్నూరు కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆలూరు గ్రామానికి చెందిన దండు రవికిరణ్, నిర్మల్ పట్టణ బుధవారపేటకు చెందిన రవికుమార్ నిర్వహిస్తున్న కిరాణా దుకాణాల్లోకి ఓ మైనర్ బాలుడు సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి సెల్‌ఫోన్‌లను అపహరించాడు. చోరీ చేసిన మొబైళ్లలో ఫోన్‌పే యాప్‌లను ఉపయోగించి రవికిరణ్ ఖాతా నుంచి రూ.20,000, రవికుమార్ ఖాతా నుంచి రూ.13,000 మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదిలీ చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు గూగుల్ ఫోటోస్‌లో బాలుడు తీసుకున్న సెల్ఫీలు ఆధారంగా అతని గుర్తించి, శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు.

రికవరీ చేసిన వస్తువులు:

* ₹38,000 నగదు

* Vivo 5G మొబైల్ ఫోన్

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మున్నూరు కృష్ణ మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైళ్లను నిర్లక్ష్యం చేయకూడదని, ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ యాప్‌లకు భద్రత కలిగిన పాస్‌వర్డులు, పిన్ నంబర్లు పెట్టుకోవాలని సూచించారు. ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందంలోని ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుళ్లు ఆకాష్, వినోద్, ప్రణీత్‌లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ఏఎస్పీ రాజేష్ మీనన్ అభినందనలు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading