నిర్మల్
విద్యార్థులను గాయపర్చిన వీధి కుక్కలు


త్రిబుల్ ఐటీలో విధి కుక్కల సైరా విహారం
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు గాయాలు
వీధి కుక్కల వివరణకు చర్యలు చేపడతాం
జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం. బాసర త్రిబుల్ ఐటీ లో, వీధి కుక్కల దాడిలో కళాశాలలోని క్యాంపస్ వద్ద ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులపై దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. దీనితో గమనించిన తోటి విద్యార్థులు కళాశాల అధికారులకు సమాచారాన్ని అందించగా. అనంతరం అధికారులు విద్యార్థులను కళాశాలలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. అనంతరం విద్యార్థులు కళాశాలలో జరుగుతున్న పరీక్షలకు కూడా హాజరయ్యారు, ఈ సందర్భంగా, బాసర త్రిబుల్ ఐటీ లో గతంలో కూడా పిచ్చికుక్కల స్వైర విహారం జరిగిన సమాచారం. విజితమే, అయితే వీధి కుక్కలు ఎక్కడ నుండి వస్తున్నాయి అనే మాట ప్రశ్నార్థకంగా మారింది ? కళాశాల చుట్టుపక్కల ప్రహరీ గోడ రెండు గేట్ల వద్ద సిసి కెమెరాలు సెక్యూరిటీ గార్డ్ ఉండడంతో. ఇలా విధి కుక్కలు. ఎక్కడినుండి వస్తున్నాయని మాట సందేహంగా ఉంది, ఒక విషయం ఏంటంటే అక్కడక్కడ విద్యార్థులు పారేస్తున్న వ్యర్థ పదార్థాలు అన్నం తిన్న తర్వాత వదిలేసిన భోజనం, పారడంతో కానీ పారిశుద్ధ్య వస్తువులు తినడంతో ఈ కుక్కలు ఇలా మారిపోయి ఉంటాయని భావిస్తున్నారు. దీనితో కళాశాల సిబ్బంది డైరెక్టర్ సతీష్ కుమార్ ఆచార్య విసి వెంకటరమణ. స్పందించి వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా, కళాశాల అధికారులు మాట్లాడుతూ క్యాంపస్లో విధి కుక్కలు ఉన్న మాట వాస్తవమేనని వాటిని నివారించడానికి స్టూడెంట్ వెల్ఫేర్ విభాగం నుండి ప్రత్యేక డాగ్ స్క్వాడ్ తెప్పిస్తున్నామని సంబంధిత విభాగ పతి అధికారులకు కళాశాల డైరెక్టర్ విసి ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఏదేమైనా కళాశాలలో ఇలా వీధి కుక్కలు, పిచ్చికుక్కలుగా మారతాయని, మునుముందు అనేక దుర్ఘటన సంఘటనలు జరుగుతాయని. విద్యార్థుల తల్లిదండ్రుల ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. వాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








