Crime
| nandipet అక్రమ నల్లమట్టి టిప్పర్లను పట్టుకున్న ఎమ్మార్వో


అక్రమ నల్లమట్టి టిప్పర్లను పట్టుకున్న ఎమ్మార్వో


నందిపేట్ ఏప్రిల్ 21 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట, డొంకేశ్వర్ మండలాలు, అటు గోదావరి అవతల లోస్రా మండల లో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గగానే రైతుల పేరిట నల్ల మట్టి దందా యదేచ్చగా ప్రతి సంవత్సరం సాగుతూనే ఉంటుంది.
ఈ నల్ల మట్టి తరలింపు దూర ప్రాంతాలైన ఇతర జిల్లాల దాకా తరలించి బడాబడా వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా కాసులు సంపాదిస్తున్నారు. పది చక్రాల టరాసులతో అధిక లోడు వేసుకొని, విపరీతమైన వేగంతో నడుపుతూ మండల కేంద్ర మెయిన్ రోడ్డు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
గత సంవత్సరం కొండూరు రోడ్డులో ప్రయానిస్తున్న కొత్తూరు వ్యక్తికి అధిక వేగంతో టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి, అలాగే ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాల నుంచి పడ్డ నల్ల మట్టి వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే ఈ నల్ల మట్టి అక్రమ దందాకు అడ్డుకట్టు వేయాలని, ఎస్సారెస్పీ అనుమతులు లేని వాహనాలపై కేసులు నమోదు చేయాలని, ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ సంతోష్ రెడ్డిని వివరణ కోరగా ఈరోజు ఉమ్మెడ వైపు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నల్ల మట్టి తరలించే 11 వాహనాలను పట్టుకోవడం జరిగిందని, వారికి ఎటువంటి అనుమతులు లేవని, వారిపై ఒక్కొక్క వాహనానికి పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని, ఎస్సారెస్పీ అనుమతులు తప్పనిసరి అని, అనుమతులే కాకుండా ఓవర్ లోడ్, అధిక వేగంతో నడిపిన కానీ కేసులు చేస్తామని హెచ్చరించారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




















