Connect with us

Uncategorized

కూల్చివేత దాడుల వెనక ఉన్న మర్మం ఏంటీ..!?

janamvelugunews

Published

on

జనం వెలుగు నిర్మల్:– సంవత్సరాలుగా ఉన్న అసైన్డ్ భూములు, వాటిలో ఎటువంటి నిర్మాణాలు, లేదా క్రయ విక్రయాలు చేయడకూడదు అనే విషయం జగమెరిగిన సత్యం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈరోజు  నిర్మల్ పట్టణంలోని శాంతి నగర్ లో ఓ కౌన్సిలర్ కి సంభందించిన వెంచర్, దాని ముందర ఉన్న  ఖాళీ ప్రదేశం మరో వ్యక్తికి సంభందించినది అంటూ, కమీషనర్ తో పాటు పట్టణ MRO భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈరోజు ఉదయం వెంచర్ లోని ప్లాటింగ్ సూచికలు, ఇటు ఖాళీ ప్రదేశంలో నిర్మించుకున్న పేదల గుడిసెలు JCB సహాయంతో కూల్చివేశారు. అధికారుల పని వారు సక్రమంగా చేస్తున్నారే అనుకుంటే. అసలు అక్కడ వెంచర్ వేసుకోవడానికి అనుమతి ఎలా ఇచ్చారు. అది ఎవరి ఆధీనంలో ఉంది అన్నది తెలియలేదా, ఇటు మరో వ్యక్తి ఇది నా భూమే అంటూ అమ్మకాలు జరిపి లక్షల్లో వసూళ్లు రాబట్టుకుని ప్లాట్లు అమ్మితే నిజమే అనుకుని అక్కడ ఇండ్లను సైతం కట్టుకున్నారు. వారికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఇంటి నంబర్ కేటాయించి మరీ ఇంటిపన్ను వరకు కట్టించుకున్నారుగా. ఆ ఆదేశాలు ఇచ్చిన అధికారులకి తెలీదా లేక పోనీలే అనుకుని వదిలేసి ఇప్పుడు కొంప గూడు లేకుండా చేసి వెళ్లిన అధికారులకి తెలీదా. అన్నది మినియన్ ప్రశ్న గా మిగిలిపోయింది. మొత్తానికతే ఆ నిర్మల్ శాంతినగర్ లో ఉన్న ఈ రెండు స్థలాల్లో కొనుగోలు చేసిన వారు నిండా మునిగేఅవకాశం మాత్రం లేకపోలేదు.

Uncategorized

ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన

janamvelugunews

Published

on

ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన

జనంవెలుగు, లోకేశ్వరం, నవంబర్ 12: లోకేశ్వరం మండలం పరిధిలోని ధర్మోరా, అబ్దుల్లాపూర్ గ్రామాల రైతులు వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, మంగళవారం వారు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. రైతులు మాట్లాడుతూ, ఈ వానాకాలం సీజన్‌లో పండించిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన కేంద్రాలు అందుబాటులో లేకపోవడం తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. పండిన పంటతోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో పంట సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “సర్కారు ఇలాగే కొనసాగితే, గ్రామస్థులు తమ హక్కుల కోసం మరింత గట్టిగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారు. సమగ్ర సర్వేకు మేము సహకరించేందుకు సిద్ధంగా లేము,” అని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్థుల నిరసన నేపథ్యంలో అధికారులు త్వరగా స్పందించి, రైతుల సంక్షేమం కోసం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.

Continue Reading

Uncategorized

ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం

janamvelugunews

Published

on

ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం

Continue Reading

Uncategorized

రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి

janamvelugunews

Published

on

రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి
38 ఎకరాల భూమి అందచేయనున్న సీఎం

మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అందచేత

 జనం వెలుగు, హైదరాబాద్:-  సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు.

ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డిలతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు..
రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.

Continue Reading