నిర్మల్
సాంకేతిక అభివృద్ధిలో గణిత శాస్త్రం ఎంతో ప్రాధాన్యత


త్రిబుల్ ఐటీ లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం
జాతీయ మ్యాథమెటికల్ మోడల్ సెమినార్
జనం వెలుగు, బాసర:- జ్రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటీ లో మంగళవారం ఆర్జీయూకేటీ బాసరలో జాతీయ గణిత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్జీయూకేటీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ‘మ్యాథమెటికల్ మోడలింగ్’ పై జాతీయ సెమినార్ను నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహించుటకు సహకారాలు అందించాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎస్ఐటి వరంగల్ ఆచార్యులు డాక్టర్ సిహెచ్ రామ్ రెడ్డి విచ్చేసి గణిత మోడలింగ్ యొక్క ప్రాథమిక అంశాల గురించి వివరించారు. ప్రధానంగా సాంకేతిక అభివృద్ధిలో గణిత శాస్త్ర ప్రాధాన్యతను వివరిస్తూ గణితాన్ని ఇంజనీరింగ్ విభాగాలలో ఎలా పొందపరచవచ్చు, గణిత నమూనాలను నిర్మించే పద్ధతులు, క్రమబద్ధమైన విధానం యొక్క స్థితిగతులను గూర్చి విశ్లేషణాత్మకంగా వివరించారు. నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో గణిత మోడలింగ్ ఏ విధంగా అమలుపరచవచ్చునే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థల గణిత నమూనా యొక్క ప్రాథమిక అంశాల గురించి వివరించారు. మెడికల్ సైన్స్ భాగాలలో గణితాన్ని ఎలా ఉపయోగించవచ్చు తెలిపారు. ఫ్లూయిడ్ డైనమిక్స్ లో గణిత నమూనాల ఉపయోగాల గురించి, వాటి కదిలికలను అధ్యయనం చేయడంలో పరస్పర చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ ప్రో సతీష్ కుమార్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి ఆడెపు మధుసూదన్, అసోసియేట్ డీన్స్ డాక్టర్ పావని, డాక్టర్ నాగ సాయి, డాక్టర్ దత్తు, అధ్యాపకులు సునీల్, కుమార్, సాయన్న, ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








