నిర్మల్
నాందేడ్ లో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ


టిఆర్ఎస్ పార్టీలో చేరనున్న మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు
నాందేడ్ కు పెద్ద సంఖ్యలో తరలిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు
జనం వెలుగు, బాసర:- భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నేతృతంలో నేడు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో బహరి బహిరంగ సభ పెడుతున్న శుభ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం నుండి టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కొన్ని పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు అయితే గతంలో మహారాష్ట్ర వాసులు ధర్మవరం నాందేడ్ జిల్లా నుండి కొందరు తమ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తి మాకు తెలంగాణ పార్టీ చేస్తున్న ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి అని మా ప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలపాలని ఉద్యమాలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీపై పూర్తి భరోసాతోనే పలు పార్టీలకు చెందిన మహారాష్ట్ర నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని నిజమాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్. దాదన్నగారి విఠల్ రావు అన్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ పట్టణంలో గల క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమక్షంలో మండలానికి చెందిన సుమారు 50 కుటుంబాలు బీఆర్ఎస్లో పార్టీ లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి ప్రతి స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. రేపు జరిగే నాందేడ్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర బిఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నాయకులు ధర్మబాద్ కు రావడంతో బిజెపి పట్టణ జిల్లా అధ్యక్షుడు రవీంద రావు అతిథి మర్యాదపూర్వకంగా కలిసి వారికి ఘనంగా స్వాతం పలికారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








