Connect with us

నిర్మల్

భక్తి పారవశ్యంతో మహాశివరాత్రి ముగింపు వేడుకలు

INTHIYAZ MIRZA

Published

on

జనం వెలుగు, లోకేశ్వరం:-   లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాల శైవక్షేత్రాలతో పాటు మండల కేంద్రంలోని లోకేశ్వరాలయంలో మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని లోకేశ్వరాలయంలో ఆదివారం ఉదయం నుండి ప్రాతఃకాల సుప్రభాతం, పూజ అభిషేకం, అలంకారం స్థాపిత దేవతా హోమాలు, జయాదులు, బలిం, పూర్ణాహుతి, త్రిశూల స్నానం, తదితర కార్యక్రమాలతోపాటు ఉదయం11 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని ఆయా గ్రామాల భక్తులు విచ్చేసి తమ ఉపవాస దీక్షలను విరమించారు, అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా ప్రోగ్రాం వారు, మరి కొందరు స్థానికులు, ఆలపించిన భక్తి పాటలకు భక్తులు ఆనంద పరవశ్యంలో మంత్రముగ్ధుయ్యారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు గ్రామంలో ప్రధాన వీధులగుండా రథోత్సవం, 7గంటలకు కుంకుమార్చన,ప్రదోష పూజ, ఏకాంత సేవ,ధ్వజారోహణం, ఆశీర్వచనం, పండిత సన్మానంలతో పాటు భక్తులకు ప్రసాద వితరణ, కార్యక్రమాలను నిర్వహించారు.

అన్నదాత లక్ష్మణ్ రావు దంపతులకు ఘన సన్మానం

ఆలయానికి విచ్చేసే స్థానిక, ఆయా గ్రామాల,భక్తుల ఉపవాస దీక్షల విరమణ సౌకర్యార్థం దాదాపు 1లక్ష 50,వేలరూపాయల ఖర్చులను వెచ్చించి అన్నదాన కార్యక్రమానికి కావలసిన అన్ని వసతులను ఏర్పాటుచేసిన దాత విట్టోలికల్పన- లక్ష్మణ్రావు,దంపతులను ఆలయకమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శాలువాలతో ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య కపిల్, ఎంపీటీసీ జై సాగర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు కే.రాజశేఖర్, వీడీసీ పెద్దలు, విట్టోలి విజయరావు, వేద పండితులు వామన్ జోషి, సంతోష్ జోషి, శ్రావణ్, ల బృందం, ఆలయ పూజారిఅమూల్, నాయకులు చిన్నారావు, మెoడే శ్రీధర్, విట్టోలి రవీందర్ రావు, శుభాష్ రెడ్డి, కే.వెంకట్రావు, సంటేనోల్ల గంగాధర్, నర్సగౌడ్, ఆష్టం భోజన్న, అల్లోలమురళి, సవీన్, రసూల్, రామోల్ల రమేష్, గోజ్జి మురళి, మంగలి శ్రీనాథ్, పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల భక్తులు, యువతీయువకులు పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading