Connect with us

నిర్మల్

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

INTHIYAZ MIRZA

Published

on

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
పాల్గొన్న మూడు రాష్ట్రాల అధికారులు
జనం వెలుగు, బాసర:- ఎగువ భాగమున మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మబత్త లో నిర్మించిన బాబ్రీ ప్రాజెక్టు లను బుధవారం 14 వ గేట్లను (సిడబ్ల్యుసి) సెంట్రల్ వాటర్ కమిటీ అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం బాబ్లీ గేట్లను ఎత్తివేశారు ఎత్తివేశారు.గతంలో బాబ్లీ గేట్లను వ్యక్తి వేయడానికి. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా జూన్ మాసంలో బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేస్తారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ సమీపంలో సమీక్షానా 0.6 నీటిని దిగువన ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వదులుతారు సుదీర్ఘంగా నాలుగు నెలల పాటు అనంతరం సెప్టెంబర్ 29న మూసివేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీ యొక్క నిర్ణయంతో బాబ్లీ ప్రాజెక్టులో నిండు నీరు ఉండడంతో మధ్యలో కూడా బాబ్లి ప్రోజెక్ట్ స్థాయికి దక్క నీరు ఉంటే ఎప్పుడైనా వివో భాగమున గేట్లు ఎత్తి అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. దీనితో బుధవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అందరి సమక్షంలో గేట్లను ఎత్తివేసేందుకు ప్రాజెక్టు వద్దకు వచ్చిన రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో బుధవారంఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1న గేట్లు ఎత్తగా ప్రస్తుతం బాబిలి ప్రాజెక్టులో 0. 47 టిఎంసిల మీరు ఉండగా 0.60 టిఎంసిల నీటిని దిగువ భాగమున ఎస్సారెస్పీ ప్రాజెక్టులో వదిలారు ఇప్పుడు ఎగువ భాగమైన ప్రాజెక్టులు 1.07 టిఎంసిల నీరు ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ చౌగాలే ఏ ఈ నాందేడ్ ఆర్ ఆర్ ఆటోదార్ ఎం చక్రపాణి, ఈ ఈ  ఎస్ ఆర్ ఎస్ పి ఎం వంశీ, ఏ ఈ ఎస్ ఆర్ ఎస్ పి బంజారా బచావో సమితి సభ్యులు గ్రామస్తులు పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading