Connect with us

నిర్మల్

ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

INTHIYAZ MIRZA

Published

on

ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
బాసరలో పెంచిన సిలిండర్ గ్యాస్ ధరలను నిరసిస్తూ నిరాశనాలు
జనం వెలుగు, బాసర:- గ్యాస్ సిలిండర్ ధరలను పదే పదే పెంచడం వలన కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాన్ని వ్యక్తము చేశారు జాతీయ భైంసా నిజాంబాద్ ప్రధాన రహదారి పై రైల్వే స్టేషన్ సమీపాన శివాజీ చౌక్ వద్ద శుక్రవారం రహదారిపై నిరసన తెలిపి నారు. బాసర సర్పంచ్ లక్ష్మణరావు మాట్లాడుతు మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను ఒకేసారి రూ.50 పెంచిందని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఊరట కల్పించకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలం బిస్తోందని.. గత ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను అనేకసార్లు పెంచిందన్నా రు. పేదల వెన్ను విరిచి, ప్రజా సంక్షేమంతో తనకు సంబంధం లేదని నిరూపించినదని, ఓ వైపు తెలం గాణ బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ప్రజాభిమానం ఉన్న నేత చంద్రశేఖర్ రావు పేద ప్రజలను ఉద్దరించే దిశగా అడుగులు వేస్తున్నారు. పేద ప్రజలకు, అలాగే రాష్ట్రంలోని రైతులకు పింఛన్లు జారీ చేయడం ద్వారా అండగా వున్నారని తెలిపారు. రైతుబంధు, బృహత్తర పథకాల ద్వారా ప్రజలు పాలిట దూతలుగా మారారని, ప్రజల కష్టాలు తీర్చేం దుకు బి. ఆరీస్ పార్టీ అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని, మరోవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంతరంగా భారం మోపుతోంది. పేద ప్రజల బలహీన వెన్నులో ద్రవ్యోల్బణం, దీనిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు  ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిలేండర్లతో నిరసన ప్రదర్శించారు. ఈ కార్యక్రమములో బాసర మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్వ్ శ్యామ్ శ్యామ్, సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు, నూకం రామారావు జ్ఞాని పటేల్ పి ఎస్ ఎస్ చైర్మన్ తీగల వెంకటేష్ గౌడ్ భైంసా మార్కెట్ కమిటీ సభ్యులు బల్కం దేవేందర్ బైరిశెట్టి సంజు కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading