నిర్మల్
బాసర త్రిబుల్ ఐటీ లో కోహ సాఫ్ట్వేర్ పై జాతీయ స్థాయి వర్క్ షాప్


బాసర త్రిబుల్ ఐటీ లో కోహ సాఫ్ట్వేర్ పై జాతీయ స్థాయి వర్క్ షాప్
జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీలో శనివారం డిజిటల్ లైబ్రరీ ఆవరణలో గ్రంథాలయ నిర్వహణ – కోహ సాఫ్ట్వేర్ ఉపయోగం అనే అంశంపై జాతీయస్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచం సాంకేతికత వైపు పరుగెడుతున్న సమయంలో గ్రంథాలయాల్లో కూడా సాంకేతికతను ఉపయోగిస్తూ విద్యార్థులకు చేరువయ్యే విధంగా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆర్జీయూకేటీలో దాదాపు 200 కంప్యూటర్ సిస్టం తో డిజిటల్ లైబ్రరీ లో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారని, కోహ సాఫ్ట్వేర్ ద్వారా మరింత సమాచారం అందించే విధంగా ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన అతిధి కిషోర్ కోరంగి గారు ఎస్.కె మాట్రిక్ సొల్యూషన్ హెడ్ ఐటి అండ్ డైరెక్టర్ హైదరాబాద్ గారు మాట్లాడుతూ కోహ సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ వలన విద్యార్థి ఏ చోటనుండైనా గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని రోజులలో తిరిగి పొందగలం? ఒక్కో విద్యార్థి ఎన్ని పుస్తకాలు గ్రంథాలయం నుండి పొందారు? సకాలంలో ఆ విద్యార్థి ఆ పుస్తకాన్ని గ్రంథాలయానికి అప్పగించకపోతే ఆ విద్యార్థికి సమాచారం పంపడం తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఫ్యాకల్టీ ఇంచార్జ్ రంజిత్ కుమార్, గ్రంథాలయ అధికారి డాక్టర్ కే అరుణ జ్యోతి, గ్రంథాలయ సిబ్బంది శైలజ అర్చన ఉద్యోగులు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








