Connect with us

Crime

ప్రేమపెళ్లి చేసుకున్నందుకు రూ.50వేల జరిమానా..?

janamvelugunews

Published

on

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కులాలు, మతాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటున్న సమాజం ఇది. మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నా.. ఇంకా కులం కట్టుబాట్లు అంటూ పట్టుకొని వేలాడుతున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. ఆధునిక యుగంలోనూ కులమతాలు అనే కక్ష్యలు పెట్టుకొని సాటి మనిషిపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అంతేకాదు పెద్దరికం పేరుతో అమానుషాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నచ్చినవాడిని పెళ్లాడే స్వేచ్ఛ అమ్మాయిలకు లేకుండా పోయింది. అలా ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకున్న ఓ యువతిపట్ల పెద్దలు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. ప్రేమ పెళ్లికి జరిమానా విధించి అది కట్టకపోవడంతో మృగాల్లా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్ళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) ఏర్పేడు మండలం, పాత వీరాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన లీలావతి అనే యువతి ఎనిమిది నెలల క్రితం కడప జిల్లాకు చెందిన శ్రీహరి అనే యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

ప్రియుడ్ని పెళ్లాటిన నాటి నుంచి అత్తారింటిలోనే ఉంటున్న లీలావతిని ఇటీవల పుట్టింటివారు ఇంటికి పిలిచారు. దీంతో ఈనెల 14న భర్తతో కలిసి స్వగ్రామమైన వీరాపురం గ్రామానికి వెళ్లింది. అక్కడివరకు అంతా బాగానే ఉంది. ఐతే లీలావతి పుట్టింటికి వచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడికి వచ్చారు. అందరూ వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. కొద్దిసేపటి తర్వాత అసలు పంచాయతీ మొదలుపెట్టారు.

గ్రామ కట్టుబాటు ప్రకారం ప్రేమ వివాహం.. అందునా కులాంతర వివాహం చేసుకున్నవారికి జరిమాన విధించడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుందంటూ లీలావతి భర్త శ్రీహరికి వివరించారు. తమ గ్రామ కట్టుబాటును అతిక్రమించి ప్రేమ వివాహం చేసుకున్న లీలావతికి 50 వేల రూపాయలు జరిమాన విధించారు. జరిమానా చెల్లించేందుకు కొంత సమయం కావాలని లీలావతి కుటుంబ సభ్యులు గ్రామస్తులను వేడుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు గడువు ఇచ్చారు. అయితే నగదు సమయానికి దొరక్క పోవడంతో మరికొద్ది రోజులు గడువు అడిగారు.

దీంతో లీలావతిపై ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో‌ పడి ఉన్న లీలావతిని కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఐతే దెబ్బలు బలంగా తగలడంతో ఆమెకు గర్భస్రావమైనట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

janamvelugunews

Published

on

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష

జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గడిచిన వారం రోజుల్లో 138 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.

తేదీ 25-05-2026 నుండి 30-05-2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 138 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 9 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.11,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

పోలీస్ కమిషనర్ సూచనలు:

• మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

• వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలి.

• డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుంది.

• మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా ప్రయోజనాలు లభించవు.

• మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

• ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

మోటార్ వెహికల్ యాక్ట్–1988 సవరణ చట్టం–2019 ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చని, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.

Continue Reading

Crime

|crimenews నందిపేట మండల కేంద్రంలో చోరీ….

janamvelugunews

Published

on

నందిపేట మండల కేంద్రంలో చోరీ….

పొద్దున పొద్దున్నే 10 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణం….

కట్ట పనికి వెళ్లొచ్చే సరికే కానిచ్చేశారు..

నందిపేట్ మే 28 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర నాగమంతెన సంఘం దగ్గర కాలనీలో నివాసం ఉంటున్న నడ్కుడ రాధా ఇంట్లో చోరీ జరిగింది.

   బుధవారం సుమారు ఉదయం 7- 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు 10 తులాల వరకు బంగారం 2 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నడ్కుడ రాధ భర్త చనిపోయి చాలా రోజులవుతుంది, తన తల్లి కొడుకుతో నాగ మంతెన సంఘం వద్దగల కాలనీలో నివాసం ఉంటుంది.

    అయితే బుధవారం ఉదయం కట్ట పనికొరకంటూ కొడుకు బండిమీద వెళ్ళింది. కాసేపటికి రాదను దింపేసి రాజు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్లీ యధావిధిగా పొలం పనికి వెళ్ళాడు. వృద్ధురాలైన రాధాత తల్లి ఇంట్లో ఒక్కతే ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి వచ్చారు. వీరు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గురించి చర్చించుకొని మేస్త్రి డబ్బులు కట్టమన్నాడని,

   మేస్త్రీకి డబ్బులు ఇచ్చేందుకు బీరువాలో ఉన్న నగదును చూసుకునేందుకు బీరువా దగ్గరికి వెళ్లగా బీరువా తాళం చేయి కనిపించలేదు. అనుమానం వచ్చి ఒకరికొకరు వాకబు చేసుకున గా బీరువా తాళం చేయి కనిపించే పోయేసరికి బీరువాతాలాన్ని పగలగొట్టి చూడడంతో అందులో ఉన్న బంగారం నగదు కనిపించక పోయేసరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

   మా అమ్మ నేను బయటకెళ్ళిచ్చేసరికి మా అమ్మమ్మను పక్కింటి వ్యక్తి ఒకరు బయటకు తీసుకెళ్లడం జరిగిందని, ఆ వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు నడ్కుడ రాజు. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Crime

|crimenews మంటగలిసిన మాతృత్వం 

janamvelugunews

Published

on

మంటగలిసిన మాతృత్వం 

ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం 

నందిపేట్ మే 24 జనం వెలుగు: మాతృత్వం మంట కలిసింది.. ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం

హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళితే మెయిన్ రోడ్డు లో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో పసికందును ఘర్కశంగా విసిరేశారు.

స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటు పైనుంచి ఆ నిర్మాణస్య ప్రాంతంలో వెళ్లేసరికే అక్కడ ఒక పసి గుడ్డు ఏడుపులు విని వెంటనే అసిఫాన్ అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలపడంతో వెంటనే వాళ్లు ఆ పసి గుడ్డును హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది.

అయినా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో ఆ పసి గుడ్డు మరణించడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడపిల్ల అనే నెపంతోనో.. లేదా అక్రమ సంబంధమో..

తెలియదు కానీ అభం శుభం తెలియని ఆ చిన్నారిని మండుటెండలో విశ్రేయడం మాతృత్వానికే మచ్చ అని ఇటువంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Continue Reading