Connect with us

Politics

ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కోసం సై అంటే సై

janamvelugunews

Published

on

18 మందిలో స్థానికులకు టికెట్ వస్తుంది ఎవరికో

స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,,ప్రెస్మీట్లు

ఏనుగు రవీందర్ రెడ్డి కి టికెట్ వస్తుందా?

మదన్మోహన్రావుకు టికెట్ ఇస్తారా?

బాన్సువాడ అభ్యర్థి టిక్కెట్టు కిస్సా పంచాయతీ ఇంకెన్నాళ్లు

బాన్సువాడ నియోజకవర్గంలో 40 ఏళ్లలో ఒకేసారి ఎమ్మెల్యే టికెట్ కైవసం

ఉప ఎన్నికల్లో మళ్ళీ ఓటమి

ఈసారైనా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జెండా ఎగరవేస్తుందా? లేక వర్గ పోరుతో కూర్చి కోసం కయ్యలాట కొనసాగుతూ,, పరంపర జరుగుతుందా ?ఏది నిజం

జనంవెలుగు, బాన్సువాడ:- బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కన్ఫామ్ ఎవరికి కాకపోవటంతో, ఎవరికి టికెట్ ఇస్తారు అనేది డైలామాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు సుమారు 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే స్థానికులకు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇస్తారా? స్థానికేతరులకు టికెట్ ఇస్తారా? అనేది ఇంకా డైలమాలో ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాలు నుంచి ఒకేసారి సీటు కైవసం చేసిందని, బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని అనంతరం ఉప ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.40 సంవత్సరాలు ఒకేసారి ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరు ప్రధాన కారణమని పలువురు ఆరోపణలు చేసుకుంటున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి.2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సైతం గెలుపు దగ్గరకు వచ్చి ఓడిపోవడం వర్గ పోరే ప్రధాన కారణమని పలువురు ఆరోపణలు చేస్తుండ్రు. వైపు ఎమ్మెల్యే పోటీలో, మరోవైపు ఎంపీ పోటీలో సైతం వర్గపోరే ప్రధాన కారణమని వర్గ పోరే కొంప ముంచిందని విమర్శలు సర్వత వినిపిస్తున్నాయి. 2023లో గత కొద్దిరోజులు జరిగే ఎన్నికల్లో సైతం వర్గ పోరు ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కోసం కొట్లాటలు కొనసాగుతుందా, ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ స్థానికులకు ఇస్తారా? స్థానికేతర్లకు ఇస్తారా? ఏది ఏమైనా ఈసారైనా ఎమ్మెల్యే కుర్చీ కైవసం చేసుకుంటారా? ఎదురుచూడాల్సింది అని ,ప్రజలు ఎదురుచూస్తున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. కాసుల బాలరాజు ఇప్పటికే మూడుసార్లు ఓటమిపాలయ్యారని అతనికి ఇవ్వద్దని కొంతమంది ఢిల్లీ వరకు వెళ్లి ఆందోళన చేసిన పరిస్థితులు నెలకొన్నాయని చర్చలు వినిపిస్తున్నాయి, అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం స్థానికేతరులు అయిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్టు ప్రధానంగా చర్చలు వినిపిస్తున్నాయి. సెకండ్ ఆప్షన్ లో మదన్మోహన్రావుకు ఇవ్వనున్నట్టు అనేది కూడా చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా మదన్మోహన్రావుకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్టు కన్ఫామ్ అయినట్టు చర్చలు వినిపిస్తున్నాయి. అయితే మదన్మోహన్రావుకు బాన్సువాడకు వచ్చే ఇష్టం లేదనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటికి పొంగగానే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంతా కలిసి స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు ప్రెస్మీట్ పెడుతున్నట్టు చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. స్థానికులకే టికెట్ ఇవ్వాలని బాన్సువాడ నియోజకవర్గం కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుబడగా, 18 మందిలో గెలిచే సత్తా ఉన్నదా లేదా ఒకవేళ సత్తా లేకపోతే అధిష్టానం స్థానికేతలకు ఇవ్వనన్నట్టు, నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలు బయట జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అధిష్టానం స్థానికులకు ఇస్తే, ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 18 మంది ఒకరికి ఒకరు సహకరించుకుంటారా లేక వర్గపోరుతో మళ్ళీ కొట్లాట పంచాయతీ పెట్టుకుని ఈసారి కూడా ఓటమికి కారకులవుతారా లేక కలిసికట్టుగా పనిచేసి గెలుపు గుర్రాలు కైవసం చేసుకోవడంలో తమ వంతు కృషిని అందజేస్తారా ఎదురుచూడాల్సిందనని పలువురు భావిస్తున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. ఒకవేళ స్థానికేతరులకు టికెట్ ఇస్తే 18 మంది అభ్యర్థులతో పాటు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా సహకరిస్తారా లేక ఓటమికి కారకులవుతారా? ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకోవడంలో కలిసికట్టుగా పనిచేస్తారా? ఏది నిజం ఎదురు చూడాలని ప్రజలు భావిస్తున్నట్టు చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. మరో కొద్ది రోజుల్లో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది డిక్లేర్ చేయనట్టు సమాచారం అయితే ఎవరికి వర్తిస్తుందో ఎదురుచూడాల్సిందని ప్రజలు భావిస్తున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading