Crime
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…


రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…
– ఇసుక అక్రమ రవాణా పై చర్యలండవ్…?
– ప్రజల ప్రాణాలతో చెలగాటం…
రుద్రూర్ జనం వెలుగు : ఇసుకాసురులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో మంజీరా ప్రవకప్రాంతం నుండి ఇసుకను బోధన్ లాంటి పట్టణాలకు భవన నిర్మాణాలకు వినియోగించేందుకు పలువురు వ్యాపారస్తులు ప్రభుత్వం ద్వారా చట్టపరంగా అనుమతులు తీసుకొని సరఫరా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు, పోలీసుల అండలతో ఇసుకను అక్రమంగా తరలించే వ్యాపారం మొదలుపెడతారు. అయితే చట్టరీత్య వీరికి అనుమతులు ఏవి ఉండవు. కేవలం ఆఫ్ ది రికార్డ్ ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తూ ఉంటారు. ట్రాక్టర్లలో తరలించేటువంటి ఇసుకను మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేసి ఎలాంటి పర్మిషన్లు లేకపోతే వాటిని ఆ వాహనాలను సీజ్ చేసి నిందితులపైన కేసులు నమోదు చేస్తారు. బోధన్ పట్టణంలోని ఉద్మీర్ గల్లీ 31వ వార్డులో అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో కాలనీకి చెందిన నండిపేట్ లింగం అనే వ్యక్తికి ప్రాణాపాయం తప్పి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. కాలనిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుని బంధువులు మాట్లాడుతూ ప్రతి రోజు మితిమీరిన వేగంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








