Education
అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో ఘనంగా యుకెజీ విద్యార్థులకు గ్రాడ్యువేషన్ పత్రాల పంపిణీ


అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో ఘనంగా యుకెజీ విద్యార్థులకు గ్రాడ్యువేషన్ పత్రాల పంపిణీ
జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- ప్రాధమిక విద్య విద్యార్థులకు చాలా కీలకమైనదని మరియు వారికి అవగహాన కల్పించడానికై అన్ని రకాలుగా సమాచారం అందించాలని తద్వారా వారికి విషయాల సులభంగా అర్ధమవుతాయని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక ఆదర్శనగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ యుకెజీ విద్యార్థులకు గాడ్యువేషన్ డే పేరుతో నిర్వహించబడిన ప్రశంస పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ రకాలుగా సమాచారం అందించాలని వారికి పరిశోధనాత్మంగా సమాచారం అందించి ఆసక్తి పెంపొదించాలని కోరారు. ప్రాధమిక విద్యలో చాలా విషయాలు ఉంటాయని వాటిని విద్యార్థులకు వివిధ రకాలుగా ఆసక్తి పెంపొదించే విధంగా మరియు పోటీతత్వం పెరిగేలా విద్యనందించాలని చెప్పారు. వివిధ సందర్భాలను విశ్లేషించి ముందుంజలో ఉండే విధంగా ప్రేరేపించాలని సూచించారు. తల్లితండ్రులు కూడా పిల్లలకు వివిధ విషయాలను చాలా సృజనాత్మకంగా వినూత్నంగా తెలియపర్చి అగగామిగా నిలిపి ఆదర్శంగా ఉండాలని కోరారు. నేడు వివిధ అభివృద్ధి చెందిన దేశాలు సైతం చాలా ఉత్తమమైన భోధన పద్ధతులను అవలంభిస్తూ అభివృద్ధిని రెట్టింపు చేస్తూన్నదని చెప్పారు. తరగతి గదుల్లో విద్యార్థులకు చాలా విషయాలు తెలియపరిచేవి ఉంటాయని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారి విద్యార్థులకు వివిధ విషయాల పట్ల అవగహాన కార్యక్రమాలు నిర్వహించి ముందుకు కొనసాగలని చెప్పారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో యుకెజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతిభావంతులకు ప్రతాలను సమర్పించే విధంగానే చిన్నారులకు ప్రతాలను అందచేయడం జరిగిందని తెలిపారు. విశ్వవిద్యాయాల్లో విద్యార్థులకు ఏ విధంగా గ్రాడ్యువేషన్ కార్యక్రమాన్ని అదే రీతిలో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుందని హార్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యర్థులకు ప్రాధమికంగా పరీక్షను నిర్వహించి ప్రతిభ ఆధారంగా పత్రాలను ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ఆలపించిన రైమ్స్, స్టోరీస్, పజల్స్ వివిధ ఫన్నీ గేమ్స్ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
Crime
రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి


రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.








