Crime
బాసర త్రిబులైటిలో ఏం జరుగుతుంది


బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి మృతదేహాన్ని అడ్డుకున్న
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నామత్కర్ నవీన్
అరవింద్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యనే
ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే బాసర త్రిబుల్ ఐటీ అధికారులు మౌనంగా ఉంటున్నారు దేనికి సంకేతం?
జనంవెలుగు, క్రైమ్ నిర్మల్:- నిర్మల్ జిల్లా అధ్యక్షులు నామత్కర్ నవీన్ మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీ లో పియుసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నవీన్ ఉపాధ్యక్షులు సంతోష్, సత్యం, సాయి కుమార్ లు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన అరవింద్ కుమార్ మృతదేహాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. పదేపదే బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంలో ఉన్న వాస్తవ విషయాలను ప్రభుత్వాలు వెలికితీయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని వారు ఆరోపించారు. ఇప్పటికీ 10 నుంచి 12 మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ సముదాయంలోనే ఆత్మహత్య చేసుకోవడంలో ఉన్న అసలు విషయాన్ని గుర్తించకపోవడం దారుణమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిబిసిఐడి ఎంక్వయిరీ చేసి ఆత్మహత్యలకు గల కారణకుల కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అరవిందు కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్, సాయి సత్యం తదితరులు పాల్గొన్నారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








