Connect with us

నిర్మల్

మహిళా సంఘాల కుట్టు మిషన్ కేంద్రాలను తనిఖీ

janamvelugunews

Published

on

మహిళా సంఘాల కుట్టు మిషన్ కేంద్రాలను తనిఖీ

బోథ్ మండల స్పెషల్ ఆఫీసర్ శేషరావ్

జనంవెలుగు, బోథ్:- రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు స్వయం ఉపాధి ఆర్థిక బలోపేతం కావాలన్నా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు చదువునే విద్యార్థిని విద్యార్థుల ఏకరూప దుస్తులను బట్టల కుట్ట డానికి స్వయం సహాయక సంఘాలు ఉన్న మహిళలకు బట్టలు పంపిణీ చేసి వారు కుడుతున్న బట్టల పనితీరును శుక్రవారం బోత్ మండల స్పెషల్ ఆఫీసర్ టిఆర్డిఏ పెన్షన్ డిపిఎం శేష రావు మండలంలోని 9 క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన బట్టల కుట్టు మిషన్ కేంద్రాలను మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమల ఏపీఎం మాధవ్ తో కలిసి మండలంలో బట్టలు కుడుతున్న విధానం బట్టలు కుడుతున్న మహిళా సంఘ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీసీలు వివో ఏలు ప్రతిరోజు కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించి వారికి గైడ్స్ చేయాలని ప్రతిరోజు లక్ష్యం మేరకు బట్టలు కుట్టాలని ఆదేశించారు. ప్రతి సిసి తన క్లస్టర్లు ఇచ్చిన లక్ష్యాన్ని ఈనెల 6 తేదీ లోపు బట్టలు కుట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏపిఎం సీసీలు వివోఎలు పనితీరు మార్చుకోవాలని లేనిచో పిడి డిఆర్డిఓ ఆదేశాను ప్రకారం శాఖ పరమైన తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సీసీ వారిగా వారి యొక్క లక్ష్యం మేరకు బట్టలు కుట్టి పాఠశాలకు అందించే వరకు పూర్తి బాధ్యత సిసి తీసుకోవాలని సీసీలను కోరారు. క్షేత్రస్థాయిలో తిరిగి లక్ష్యం మేరకు పనిచేయాలని అన్నారు. తిరిగి సోమవారం రోజు బోత్ మండలంలోని 9 క్లస్టర్లలో తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. సోమవారం వరకు మండలానికి సంబంధించిన 50 శాతం లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. వారి వెంట బోథ్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల ఏపీఎం మాధవ్ కంప్యూటర్ ఆపరేటర్ అశోక్ జ్యోతి వర్మ సీసీలు వివోఏలు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading