Crime
| Nandipet Crime నందిపేటలో కిలాడీ లేడీ అరెస్టు


నందిపేటలో కిలాడీ లేడీ అరెస్టు


జనంవెలుగు, నందిపేట్ మూన్ డిజైన్ శేఖర్ :- నందిపేట మండల కేంద్రంలో ఓ ఘరానా లేడి ఆడిన ముసుగు నాటకం కు కళ్లెం వేసి ఆ కిలాడీలేడని మరో ఇద్దరిని కటకటాల వెనక్కి పంపారు నందిపేట పోలీసులు. గత 4 తేదీ నా నాపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టారని మండల కేంద్ర శ్రీరామ్నగర్ లో నివాసం ఉంటున్న పిప్పెర అంకిత(34)
పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో మళ్లీ 22వ తేదీ రోజున అదే మహిళ నా ఇంటిలోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నన్ను బంధించి నా చేతులపై, తొడల పైన వాతలు పెట్టారని, తీవ్రంగా కొట్టారని రెండోసారి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మిస్టరీని చేదించేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
అంకిత ఇంటి దగ్గరలోని సీసీ కెమెరాలను, అంకిత సెల్ ఫోన్ డాటాను, అంకితతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించారు. అయితే విచారణ లొ అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసం నాటకమాడి నాపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన ఆ కిలాడి లేడి అంకితే ఈ నాటకానికి సూత్రధారి. అంకిత, నవిన్ లు ఆడిన ముసుగు, వాతల నాటకాన్ని రెండు రోజుల్లోనే బట్ట బయలు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే సీఐ జాన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అంకిత జిల్లా కేంద్ర ఓ షాపింగ్ మాల్ లో పనిచేసేదని మండల కేంద్రానికి చెందిన సింగారం నవీన్ అనే యువకుడితో సంబంధం పెట్టుకొని మండల కేంద్రంలో గల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాటును దక్కించుకోవాలని పన్నాగం పన్నారు.
దాని కొరకు ఆ వెంచర్ ఆఫీస్ లో పనిచేసే ప్రతాప్ రెడ్డి వద్దకు అంకిత నవీన్లు వెళ్లి సంప్రదించారు. అయితే ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ప్రతాప్ రెడ్డి ప్లేస్ లో ఇదివరకు అంబటి శ్రీనివాస్ అనే అతను పని చేసేవాడని. మేనేజ్మెంట్ అతని పై లావాదేవీల ఫిర్యాదులు రావడంతో అతన్ని తీసేయడం జరిగింది, దాంతో అంబటి శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి పై కక్ష సాధింపుగా ఉన్నాడు. ఇదే తరుణంలో అంకిత నవీన్లు ప్రతాప్ రెడ్డి వద్దకు వచ్చినది తెలుసుకొని అంకిత నవీన్ లను పరిచయం చేసుకొని వీరిద్దరితో ప్రతాప్ రెడ్డిపై కక్షతీసుకునేందుకు ప్రతాప్ రెడ్డి ని బెదిరిస్తే లాభం చేకూరుతుందని నమ్మ పలికాడు. దీంతో ప్లాటు కొనేందుకు వెళితే ప్రతాప్ రెడ్డి నా పై అసభ్యంగా ప్రవర్తించాడని ప్రతాప్ రెడ్డి పై కేసు పెట్టింది అంకిత. పోలీసులు కేసు నమోదు చేసేసరికి ప్రతాపరెడ్డిని 30 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగింది అంకిత. ప్రతాప్ రెడ్డి ససేమిరా అనడంతో నాటకం నందిపేట మండల కేంద్రానికి చేరింది. నేను నందిపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్నానని, పని నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి దగ్గర నాపై ఎవరో ముసుగు వేసి దాడి చేసే కొట్టారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తున్న తరుణంలోనే మళ్లీ 20 రోజుల వ్యవదిలోనే మళ్లీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నా ఇంట్లోకి చొరబడి నన్ను బంధించి నా చేతులపైన, తొడల పైన, వాతలు పెట్టి కొట్టారని ఫిర్యాదు చేసింది అంకిత. దీంతో ఎలాగైనా ఈ కేసును చేదించాలని రంగంలోకి దిగిన పోలీసులు అంకిత ఫోన్ కాల్ ఆధారంగా సింగరాయ నవీన్, అంబటి శ్రీనివాస్ లను విచారించగా ఈ ముగ్గురే అసలు నేరస్తులని, నాటకమంతా ఆడింది వీరేనని, నాటకాన్ని బట్ట బయలు చేశారు.ఈ కిలాడి లేడి డబ్బుల కోసం తన ప్రియుడు నవీన్ తో కలిసి సినిమా స్టోరీని తలపించే నటకాన్ని ఆడింది కానీ పోలీసులు ఈ కిలాడి లేడిని తమదైన శైలితో విచారించి కటకటాల వెనక్కి నెట్టారు.
డబ్బుకోసం ముసుగు నాటకమాడి, తప్పుడు ఫిర్యాదుతో వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని, ఇటువంటి ఘరానా మోసగాళ్లు, కిలాడి లేడీ లు వేసే పన్నాగాలకు ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్యామ్ రాజ్ హెచ్చరించారు.
Crime
| nandipet అక్రమ నల్లమట్టి టిప్పర్లను పట్టుకున్న ఎమ్మార్వో


అక్రమ నల్లమట్టి టిప్పర్లను పట్టుకున్న ఎమ్మార్వో


నందిపేట్ ఏప్రిల్ 21 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట, డొంకేశ్వర్ మండలాలు, అటు గోదావరి అవతల లోస్రా మండల లో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గగానే రైతుల పేరిట నల్ల మట్టి దందా యదేచ్చగా ప్రతి సంవత్సరం సాగుతూనే ఉంటుంది.
ఈ నల్ల మట్టి తరలింపు దూర ప్రాంతాలైన ఇతర జిల్లాల దాకా తరలించి బడాబడా వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా కాసులు సంపాదిస్తున్నారు. పది చక్రాల టరాసులతో అధిక లోడు వేసుకొని, విపరీతమైన వేగంతో నడుపుతూ మండల కేంద్ర మెయిన్ రోడ్డు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
గత సంవత్సరం కొండూరు రోడ్డులో ప్రయానిస్తున్న కొత్తూరు వ్యక్తికి అధిక వేగంతో టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి, అలాగే ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాల నుంచి పడ్డ నల్ల మట్టి వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే ఈ నల్ల మట్టి అక్రమ దందాకు అడ్డుకట్టు వేయాలని, ఎస్సారెస్పీ అనుమతులు లేని వాహనాలపై కేసులు నమోదు చేయాలని, ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ సంతోష్ రెడ్డిని వివరణ కోరగా ఈరోజు ఉమ్మెడ వైపు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నల్ల మట్టి తరలించే 11 వాహనాలను పట్టుకోవడం జరిగిందని, వారికి ఎటువంటి అనుమతులు లేవని, వారిపై ఒక్కొక్క వాహనానికి పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని, ఎస్సారెస్పీ అనుమతులు తప్పనిసరి అని, అనుమతులే కాకుండా ఓవర్ లోడ్, అధిక వేగంతో నడిపిన కానీ కేసులు చేస్తామని హెచ్చరించారు.
Crime
|Armoor పేకాట స్థావరంపై సిసిఎస్ మెరుపు దాడి


పేకాట స్థావరంపై సిసిఎస్ మెరుపు దాడి.
జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కెట్, తిరుమల గాడిన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట ఆట స్థావరం పై దాడి చేసి 6 గురు పేకాట రాయుళ్ళను,3 వా హనాలు, 1 కారు, 6 సెల్ ఫోన్లు, 1,17940 రుపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓకు అప్పగించనైనది. నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 6 గురిని దాడి చేసి పట్టుకోవడం జరి గింది. పేకాట ఆడుతున్న రత్నగిరి శంకర్ గౌడ్, సుంకరి మహేష్ శాస్త్రి నగర్ నిర్మల్, మాదారపు అభిలాష్ దివ్య నగర్ నిర్మల్, సయ్యద్ ఆసిఫ్ బైంసా, మెడిదల వెంకట్ గౌడ్ మా మిడి పల్లి,తుమ్మల దత్తాద్రి గణేష్ నగర్ బైంసా తదితరులపై కేసు నామోదు చేయడం జరిగిందని ఎస్ఎచ్ఓ సత్యనారాయణ తెలిపాడు.
Crime
| Nizamabad crime అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు


అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు
జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య
జనం వెలుగు ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బోధన్ రూరల్, ఎడపల్లి, నిర్మల్ జిల్లాలోని బాసర,మూధోల్, బైంసా, కుంటాల,నర్సాపూర్ జి తథితర మండలాల శివారులో ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగ లను దొంగ తనాలకు పాల్పడే అం తరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య తెలిపాడు. జిల్లా కేంద్రంలోని పోలీసు కమీ షనరేటు కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్లడించాడు.
ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ కు సంబంధించిన అధికారులు తమ ఆధీనంలో గల ట్రాన్స్ ఫా ర్మర్ల నుండి రాగి తీగలను దొంగలు దొంగలించుకు పోయారని గతంలో ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నామోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఉత్తర రూరల్ సిఐ బి శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఐ కే శ్రీకాంత్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపాడు.
అఫ్జల్ ఖాన్ ఆటో డ్రైవర్ నిజామాబాద్, అన్సార్ అలియాస్ హుస్సేన్ ఖాన్ ఆటో డ్రైవర్ రేంజల్ మండలం, షేక్ తాహేర్ ఆటో డ్రైవర్ నిజామాబాద్, అర్బాజ్ ఖాన్ అలియాస్ అల్బాజ్ మేస్త్రి భైంసా, ప్రస్తుతం ధర్మపురి హిల్స్ నిజామాబాద్, సిద్దిక్ ఖాన్ ఆటో డ్రైవర్ రేంజల్ మండలం, మహమ్మద్ అఫ్సర్ ఆటో డ్రైవర్ భైంసా ప్రస్తుతం ఫరారిలో ఉన్నాడని ఆయన తెలిపాడు. మహబూబ్ ఖాన్ స్క్రాప్ షాప్ వ్యాపారం, భైంసా, బోర్గే బాలాజీ స్టీల్ షాప్ దుకాణం, అర్సపల్లి నిజామాబాద్, షేక్ ఆరీఫ్ పాత ఇనుప సామాన్ల వ్యాపారం, ఇత్వార బజార్ నాందేడ్, మహారాష్ట్ర, మహమ్మద్ రజా పాత ఇనుప సామాన్ల వ్యాపారం, వెంగళరావు కాలనీ నిందితుల నుండి సొమ్మును రికవరీ చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపాడు. 20 క్వింటాళ్ళ రాగి తీగలు, 2 లక్షల 75 వేల రూపాయల నగదు,రెండు టు వీలర్ వాహనాలు, ఒక ఆటో, దొంగ తనానికి వాడిన హక్సు బ్లేడ్లు 05 పని ముట్లు ఉన్నాయని ఆయన తెలిపాడు.
అఫ్జల్ ఖాన్ కు సంబంధించిన ఆటోలో అందరూ కలిసి వచ్చి ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగలను దొంగ తనం చేసే వారని, వీరి మీద సుమారు 34 కేసులకు సంబంధించి సుమారు 10 క్వింటాళ్ళ రాగి తీగలను దొంగిలించడం జరిగిందని, ఈ రాగి తీగలను నిజామాబాద్ లోని ఏపిఎచ్బి కాలనీలో చిన్న రూంను అద్దెకు తీసుకుని అక్కడ దాచి పెట్టి,వాటిని గోనె సంచులలో నింపుకుని తరలించుకు పోయి అమ్ముకుని సొమ్ము చేసుకునే వారని ఆయన తెలిపాడు. భైంసాకు చెందిన మహబూబ్ ఖాన్ కిలోకు 800 రుపాయల వంతున అమ్మేవారని, నిజామాబాద్ కు చెందిన బాలాజీకి, రహన్ రజాకు, నాందేడ్ కు చెందిన ఆరిఫ్ లకు అమ్మగా వచ్చిన డబ్బులను జల్సాలకు, ఇతర వాటికి ఖర్చులు చేసే వారని ఆయన తెలిపాడు.
పోలీసులు తమ చాక చక్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గ్యాంగ్ ను పట్టుకుని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన 34 కేసులను డిటెక్టు చేయడం జరిగిందని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ తరలించడం జరిగిందని ఆయన తెలిపాడు.ఈ కేసును చేదించిన నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ యాదవ్ ఆద్వర్యంలో టీంలుగా ఏర్పడి ఉత్తర రూరల్ సిఐ బి శ్రీనివాస్,నవీపేట్ ఎస్ఐ కే శ్రీకాంత్,ఎస్ఐ యాదగిరి గౌడు, ఎస్ఐ రాజశేఖర్, మాక్లూర్ ఎస్ఐ గంగాధర్,5 వ టౌన్ ఏఎస్ఐ గఫార్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్లు రాజారెడ్డి, సందీప్, అబ్బులు,శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ తదితరులను సిపి అభినందించాడు.



















