Connect with us

మెదక్

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక

janamvelugunews

Published

on

Views: 72

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక

జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మెదక్

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్

janamvelugunews

Published

on

Views: 2

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్

జనంవెలుగు, చిలప్ చెడ్:-  మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.

రక్తదాత సుఖీభవ

Continue Reading

మెదక్

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్

janamvelugunews

Published

on

Views: 0

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్

జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరఫ్‌పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అప్పుడే పుట్టిన శిశువుల నుండి ఐదు సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో రెండు చుక్కలు వేయడం ఎంతో అవసరం. ఇది వారి ఆరోగ్య భవిష్యత్తుకు బలమైన పునాది” అని తెలిపారు. పోలియో లేని గ్రామంగా సరఫ్‌పల్లిని తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు సమీప పోలియో టీకా కేంద్రాలకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోవర్ధన్ పిలుపునిచ్చారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Continue Reading

మెదక్

MGNREGS| ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ

janamvelugunews

Published

on

Views: 0

చిట్కుల్‌లో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ

జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను గ్రామస్తులకు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సామాజిక తనిఖీ చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ బాగువాన్ రెడ్డి, టిసీ సురేష్, మండల కిసాన్‌సాల్ అధ్యక్షులు విట్టల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ భూమయ్య, మాజీ ఎంపీటీసీ సుభాష్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు, కార్యదర్శి తిరుపతి, మైనారిటీ సీనియర్ నాయకులు ఎండి అఖిల్, ఇంతియాజ్, బాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Continue Reading