Connect with us

మెదక్

మంజీరా నదిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య యత్నం కాపాడిన నలుగురు యువకులు

janamvelugunews

Published

on

Views: 0

జనం వెలుగు, (6 నవంబరు) చెలిపీఛెడ్:- మంజీరా నదిలో దూకి ఆత్మహత్య యత్నం చేసుకున్న వృద్ధురాలని సాహసం చేసి నలుగురు యువకులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా చెలిపీఛెడ్ మండలం చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయం సమీపంలోని మంజీరా నదిలో ఒక వృద్ధురాలు దూకి ఆత్మహత్య  యత్నం చేసుకోగా అక్కడే ఉన్న , ఇంతియాజ్, వినోద్ కుమార్, సలీమ్, సురేష్, రవీందర్ అనే యువకులు నదిలో దూకి సాహసం చేసి వృద్ధురాలు రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆందోళనలో ఉన్న వృద్ధురాలు తన వ్యక్తిగత వివరాలు ఏమి చెప్పలేకపోతుందని స్థానికులు తెలిపారు. నదిలో దూకిన అమ్మా వృద్ధురాలు సిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రకుంటా తండాకు చెందిన మెగావత్ సాదిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలు బంధువులకు సమాచారం అందించి అప్పగించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మెదక్

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ

janamvelugunews

Published

on

Views: 314

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ

జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.

రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

మెదక్

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక

janamvelugunews

Published

on

Views: 86

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక

జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.

Continue Reading

మెదక్

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్

janamvelugunews

Published

on

Views: 4

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్

జనంవెలుగు, చిలప్ చెడ్:-  మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.

రక్తదాత సుఖీభవ

Continue Reading