Connect with us

నిజామాబాద్

ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

janamvelugunews

Published

on

ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

కలెక్టర్, సీపీలతో కలిసి ప్రాజెక్టు సందర్శన

వర్ష ప్రభావిత ప్రాంతాల స్థితిగతులపై అధికారులతో సమీక్ష

జనంవెలుగు, నిజామాబాద్, సెప్టెంబర్ 03 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎవరు కూడా గోదావరి నది పరిసరాల్లోకి వెళ్లవద్దని, అవాఛనీయ ఘటనలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. డ్యామ్ సైట్ పైకి చేరుకుని, ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని, 41 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న మిగులు జలాలను పరిశీలించారు. ఎస్సారెస్పీలోకి మంగళవారం మధ్యాహ్నం సమయానికి 2.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.00 టీఎంసిలకు గాను, ప్రస్తుతం 1088.0 అడుగులు, 70.140 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉంచుతూ, సుమారు 2.60 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. ఇందులో వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు నీరు వదులుతున్నామని, మిగతా వరద నీరు ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి విడుదల అవుతోందని తెలిపారు. అయితే, నీటి ప్రవాహాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ, ఎక్కడ కూడా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యానికి తావిచ్చి అనవసర తప్పిదాలకు పాల్పడితే పరీవాహక ప్రాంతాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు. అంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్, సీపీలతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పంటలకు సాగు నీటి విషయమై రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో గడిచిన మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నీటి నిల్వలను సంతరించుకున్నాయని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలతో పాటు, వచ్చే రబీ సీజన్ కూడా పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీకి చెందిన జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా చెరువులు, వాగులకు గండ్లు పడకుండా, ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయితే ప్రజలు జలాశయాలు, చెరువుల వద్దకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుండి మిగులు జలాలను విడుదల చేసినందున ఎస్సారెస్పీకి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సుమారు 4 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల మరో మూడు రోజుల పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగనుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దిగువ పరీవాహక ప్రాంతాలైన మెండోరా, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి తదితర మండలాల పరిధిలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు, ఈత కోసం వెళ్లవద్దని సూచించారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ సిబ్బందిచే నిఘాను కూడా ఏర్పాటు చేయించామని అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో రహదారులపై నుండి నీరు ప్రవహిస్తున్న చోట వాహనాల రాకపోకలను నిలిపివేయించామని, ఇతర మార్గాల గుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయించామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వి.లావణ్య, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

పేదవానికి చదివే వజ్రాయుధం

janamvelugunews

Published

on

పేదవానికి చదివే వజ్రాయుధం

జనంవెలుగు, నందిపేట్ జూన్ 18:- గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు.

  8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్ లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని,

   సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని,

    నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని,

    ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు.

   అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు.

  అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి, మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

  ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

janamvelugunews

Published

on

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి

janamvelugunews

Published

on

మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, జూన్ 16: మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.

     ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు,

      అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ,టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading