Connect with us

నిజామాబాద్

ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు

suresh sitharla

Published

on

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు

జనం వెలుగు, నిజామాబాద్:-    నిజామాబాద్ జిల్లాలో హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్ లతో పాటు జానకంపేట్ ఫీల్డ్ అసిస్టెంట్, మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ హరితహారం, మన ఊరు – మన బడి, కంటి వెలుగు కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జానకంపేట్ నుండి అబ్బాపూర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల నిర్వహణను మెరుగుపర్చుకోవాలని పదేపదే సూచించినా, తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు సంబంధిత ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేశారు. హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ కరాఖండీగా తేల్చి చెప్పారు. ఇప్పటివరకు సానుకూల ధోరణిలో చెబుతూ వచ్చానని, ఇకపై అలసత్వానికి తావు కల్పించే వారిపై తక్షణమే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీచోటా ఎవెన్యూ ప్లాంటేషన్లతో పాటు, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా కొనసాగాల్సిందేనని, ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత అధికారులు, సిబ్బంది మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. మన ఊరు – మన బడి ప్రగతిపై సమీక్షిస్తూ, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించి వెంటనే ఎఫ్.టీ.ఓ లు జెనరేట్ చేయాలని ఏ.ఈలను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని కారణంగా నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు చేసిన వారికి సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగడం లేదన్నారు. దీని వల్ల ప్రభుత్వ పనితీరుపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నందున, ఏ.ఈలు వెంటదివెంట ఎఫ్.టీ.ఓ లు జెనరేట్ చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే, ఏ.ఈలను సైతం సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నెల 25 వ తేదీ నాటికి పూర్తయిన పనులన్నింటికీ ఎఫ్.టీ.ఓ లు సిద్ధం కావాలని గడువు విధించారు. అలాగే, ఉపాధి హామీ కింద మంజూరీ తెలిపిన పనులను మార్చి నెలాఖరు నాటికి అన్ని పాఠశాలల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసిన బడులలో మిగిలిఉన్న తుది దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంపీడీఓలు గట్టి పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇదిలాఉండగా, కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని, ఈ మేరకు  అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో కృషి చేస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఇకముందు కూడా ఇదే స్పూర్తితో పని చేయాలని, శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన రీతిలో నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు, కంటి అద్దాలను అందించాలని కలెక్టర్ హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి సీ ఈ ఓ గోవింద్, మెప్మా పీ.డీ రాములు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు దేవిదాస్, భావన్న, మురళి, ఆర్దీఓ లు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఏ.పీ.డి సంజీవ్, డీ ఏ.ఓ తిరుమల ప్రసాద్, డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ తుకారాం రాథోడ్, డీటీడబ్ల్యుఓ నాగూరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు

janamvelugunews

Published

on

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లచే ప్రదానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు (Individual Highest Blood Donor Motivator) అవార్డును రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ అందుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు  లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు.

ఈ సందర్భంగా నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అవార్డు గ్రహీత ప్రశాంత్‌ను అభినందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరాయంగా రక్తం అందుబాటులో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రజావాణికి 135 ఫిర్యాదులు

janamvelugunews

Published

on

ప్రజావాణికి 135 ఫిర్యాదులు

నిజామాబాద్, జూన్ 15 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్.సీ.ఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కాగా, ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ బీ.ఎల్.ఓ లను సంప్రదించి మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading