నిజామాబాద్
| Armoor గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు


Views: 11065
గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు
గెలుపు గుర్రాలకై ఆచి, తూచి అడుగులు వేస్తొన్న పార్టీలు
మున్సిపల్ చైర్మన్ కైవసానికే ముమ్మర ప్రయత్నాలు
ఎత్తకు పై ఎత్తులతో పోటాపోటీగా పార్టీలు
సై అంటే సై అంటున్న పార్టీలు
గెలుపునే ఓ సవాల్ గా తీసుకుంటున్న పార్టీలు
గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి పార్టీలు
జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి దిగేందుకు వివిధ పార్టీలు సన్నద్దమ వుతున్నాయి. మున్సిపల్ వార్డు సభ్యుల గెలుపుతో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీ పై తమ జెండానే ఎ గురవేయాలనే ఎజెండాతో కాంగ్రెసు, బిజెపి, బిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రంగం సిద్దం చేసుకున్నాయి. 36 వార్డులు గల ఆర్మూర్ మున్సిపాలిటీలో అధికారమే లక్ష్యంగా వివిధ పార్టీలు తమ తమ ఎత్తుగ డలు వేస్తున్నాయి. ఒకరి మించిన రాజకీయ ఎత్తు గడలతో చైర్మన్ గిరిని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కదుపుతున్న పావులు. కేవలం ఆరంభంలోనే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజులలో రాజకీయం ఎలా ఉంటుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ఇది వరకే కాంగ్రెసు పార్టీ ప్రకటించడం హర్షనీయం. పార్టీని నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా పార్టీ పురోగతికి అభ్యున్నతికి పాటుపడిన వారికి పార్టీ మాకు ఆశ్రయం కల్పించి మమ్ములను చేరదీస్తొందని ఆశావహులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతే గాకుండా పార్టీలోకి నిన్న గాక మొన్న వచ్చిన వారికే పార్టీలోని కొందరు నాయకులు ఆదరిస్తున్నారని అపవాదు ఉంది.
ఇకపోతే బిఆర్ఎస్, బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీలలో తాము రంగంలో నిలిపిన వార్డుల అభ్యర్థులే గెలుపొంది తమ పార్టీ జెండానే మున్సిపాలిటీపై ఎగుర వేస్తామని ధీమాలో ఉన్నాయి. మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో కాంగ్రెసు, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలలో ఆశావహులు ఒక్కో వార్డు నుండి 3/4 మంది అభ్యర్థులు నామినే షన్లను వేసే అవకాశం ఉంది. వివిధ పార్టీల నాయకుల అధీష్టానం ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దో తెలియక తలమునకలై పోయారు.


నిజామాబాద్
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం


Views: 4
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు


Views: 224
యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు
నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన


జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.
స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.
నిజామాబాద్
|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి


Views: 90
ఘనంగా చత్రపతి శివాజీ జయంతి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




















